చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. 19 ఏళ్ల ఐపీఎల్‌ హిస్టరీలోనే | IPL 2026: Virat Kohli Unleashes Carnage, Huge Record For RCB | Sakshi
Sakshi News home page

IPL 2026: చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. 19 ఏళ్ల ఐపీఎల్‌ హిస్టరీలోనే

May 31 2026 10:29 PM | Updated on May 31 2026 10:34 PM

IPL 2026: Virat Kohli Unleashes Carnage, Huge Record For RCB

ఐపీఎల్‌-2026లో అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో ఫైనల్‌ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఓపెనర్లు విరాట్‌ కోహ్లి, వెంకటేశ్‌ అయ్యర్‌ విధ్వంసం సృష్టించారు. 158 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో గుజరాత్ పేసర్లకు వీరిద్దరూ చుక్కలు చూపించారు. ఫలితంగా ఆర్సీబీ స్కోర్‌ కేవలం 3.3 ఓవర్లలోనే (21 బంతుల్లో) 50 పరుగుల మార్క్‌ దాటింది. 

దీంతో ఆర్సీబీ ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఐపీఎల్‌ ఫైనల్ చరిత్రలో అత్యంత వేగంగా 50 పరుగులు చేసిన జట్టుగా బెంగళూరు నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉంది. ఐపీఎల్‌-2023 సీజన్‌ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌పై సీఎస్‌కే 4 ఓవర్లలో 50 పరుగులు చేసింది.

తాజా మ్యాచ్‌తో సీఎస్‌కే రికార్డును ఆర్సీబీ బ్రేక్‌ చేసింది. కాగా వెంకటేశ్‌ అయ్యర్‌ 32 పరుగులు చేసి ఔట్‌ కాగా.. కోహ్లి(36) మాత్రం అజేయంగా ఉన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ టైటాన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌(50) హాఫ్‌ సెంచరీతో గుజరాత్‌ను ఆదుకున్నాడు.

కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌(12), సాయిసుదర్శన్‌(12), జోస్‌ బట్లర్(19) వంటి స్టార్‌ ప్లేయర్లు తీవ్ర నిరాశపరిచారు. ఆర్సీబీ బౌలర్లలో రాసిఖ్ సలామ్ దార్ మూడు వికెట్లు పడగొట్టగా.. భువనేశ్వర్‌ కుమార్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌ తలా రెండు వికెట్లు సాధించారు.
చదవండి: వైభవ్‌కు నో ఛాన్స్‌.. టీ20 ప్రపంచకప్‌లో భారత ఓపెనర్లు వీరే?

 

Advertisement
 
Advertisement
Advertisement