
అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. వర్షం లేదా ఇతరత్రా కారణాలతో చేత ఓవర్లు కుదించబడిన మ్యాచ్ల్లో పవర్ప్లే నిబంధనలు మారనున్నాయి. ఇప్పటివరకు కుదించబడిన మ్యాచ్ల్లో పవర్ప్లే ఓవర్లు రౌండ్ ఫిగర్గా ఉండేవి.
ఉదాహరణకు 8 ఓవర్లకు కుదించబడిన మ్యాచ్లో మూడు ఓవర్ల పవర్ప్లే ఉండేది. కొత్త నిబంధన ప్రకారం ఇది (పవర్ప్లే) 2.2 ఓవర్లకే మార్చబడింది. సవరించిన నిబంధనల ప్రకారం పవర్ప్లేలో 30 గజాల సర్కిల్ బయట ఇద్దరు ఫీల్డర్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు జూలై నుంచి అమల్లోకి రానున్నాయి.
కుదించబడిన టీ20 మ్యాచ్ల్లో ఓవర్ల వారీగా పవర్ప్లే వివరాలు...
5 ఓవర్లకు కుదించబడిన మ్యాచ్లో పవర్ప్లే 1.3 ఓవర్లు ఉంటుంది.
6 ఓవర్లకు కుదించబడిన మ్యాచ్లో పవర్ప్లే 1.5 ఓవర్లు ఉంటుంది.
7 ఓవర్లకు కుదించబడిన మ్యాచ్లో పవర్ప్లే 2.1 ఓవర్లు ఉంటుంది.
8 ఓవర్లకు కుదించబడిన మ్యాచ్లో పవర్ప్లే 2.2 ఓవర్లు ఉంటుంది.
9 ఓవర్లకు కుదించబడిన మ్యాచ్లో పవర్ప్లే 2.4 ఓవర్లు ఉంటుంది.
10 ఓవర్లకు కుదించబడిన మ్యాచ్లో పవర్ప్లే 3 ఓవర్లు ఉంటుంది.
11 ఓవర్లకు కుదించబడిన మ్యాచ్లో పవర్ప్లే 3.2 ఓవర్లు ఉంటుంది.
12 ఓవర్లకు కుదించబడిన మ్యాచ్లో పవర్ప్లే 3.4 ఓవర్లు ఉంటుంది.
13 ఓవర్లకు కుదించబడిన మ్యాచ్లో పవర్ప్లే 3.5 ఓవర్లు ఉంటుంది.
14 ఓవర్లకు కుదించబడిన మ్యాచ్లో పవర్ప్లే 4.1 ఓవర్లు ఉంటుంది.
15 ఓవర్లకు కుదించబడిన మ్యాచ్లో పవర్ప్లే 4.3 ఓవర్లు ఉంటుంది.
16 ఓవర్లకు కుదించబడిన మ్యాచ్లో పవర్ప్లే 4.5 ఓవర్లు ఉంటుంది.
17 ఓవర్లకు కుదించబడిన మ్యాచ్లో పవర్ప్లే 5.1 ఓవర్లు ఉంటుంది.
18 ఓవర్లకు కుదించబడిన మ్యాచ్లో పవర్ప్లే 5.2 ఓవర్లు ఉంటుంది.
19 ఓవర్లకు కుదించబడిన మ్యాచ్లో పవర్ప్లే 5.4 ఓవర్లు ఉంటుంది.
ఇదిలా ఉంటే, ఐసీసీ టెస్ట్ క్రికెట్లోనూ పలు కొత్త నిబంధనలు ప్రవేశపెట్టంది. స్లో ఓవర్రేట్ను అరికట్టేందుకు స్టాప్ క్లాక్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ నిబంధన ప్రకారం ఒక ఓవర్ ముగిసిన తర్వాత ఫీల్డింగ్ జట్టు 60 సెకన్లలోపు తర్వాతి ఓవర్ను ప్రారంభించాలి.
మైదానంలో 0 నుంచి 60 వరకు లెక్కించే ఎలక్ట్రానిక్ క్లాక్ను ఏర్పాటు చేస్తారు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే ఫీల్డింగ్ జట్టుకు రెండుసార్లు హెచ్చరికలు జారీ చేస్తారు. మూడోసారి కూడా ఆలస్యం చేస్తే, బ్యాటింగ్ జట్టుకు 5 పరుగులు అదనంగా లభిస్తాయి.ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్ (2025-27) నుంచే ఈ నిబంధన అమల్లోకి రానుంది.
అలాగే షార్ట్ రన్ విషయంలో ఐసీసీ రూల్స్ను సవరించింది. బ్యాటర్లు వికెట్ల మధ్య పరుగు తీసే సమయంలో ఉద్దేశపూర్వకంగా ‘షార్ట్ రన్’కు పాల్పడితే... స్ట్రయిక్లో ఎవరు ఉండాలనే నిర్ణయం ఫీల్డింగ్ జట్టు సారథి తీసుకునే అవకాశం కల్పించింది. ఆటను మరింత జనరంజకంగా మార్చే ప్రక్రియలో భాగంగా ఐసీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.