మనీలా: ఫిలిప్పీన్ ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో గాయత్రి–ట్రెసా ద్వయం 16–21, 21–4, 21–17తో మికి కనెహిరో–యునా కాటో (జపాన్) జంటపై నెగ్గింది. గాయత్రి–ట్రెసా జోడీకి 1600 డాలర్ల (రూ. 1 లక్ష 52 వేలు) ప్రైజ్మనీతోపాటు 4000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.


