శ్రీలంక శుభారంభం | Asia cup 2025: Srilanka Wins Over Bangladesh | Sakshi
Sakshi News home page

Asia cup 2025:శ్రీలంక శుభారంభం

Sep 13 2025 11:29 PM | Updated on Sep 14 2025 4:08 AM

Asia cup 2025: Srilanka Wins Over Bangladesh

బంగ్లాపై 6 వికెట్ల తేడాతో గెలుపు 

అబుదాబి: ఆసియా కప్‌ టి20 టోర్నమెంట్‌లో శ్రీలంక శుభారంభం చేసింది. గ్రూప్‌ ‘బి’లో శనివారం జరిగిన మ్యాచ్‌లో అసలంక సారథ్యంలోని లంక 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. టాస్‌ నెగ్గిన శ్రీలంక ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 139 పరుగులే చేసింది. ఓపెనర్లు తన్‌జీద్‌ హసన్‌ (0), పర్వేజ్‌  హుసేన్‌ (0) డకౌట్‌ కావడంతో జట్టు పరుగుల ఖాతా తెరువకముందే 2 టాపార్డర్‌ వికెట్లను కోల్పోయింది. 

జట్టు రెండంకెల స్కోరు 11కు చేరగానే తౌహీద్‌ హృదయ్‌ (8) రనౌటయ్యాడు. ఈ దశలో కెపె్టన్‌ లిటన్‌ దాస్‌ (26 బంతుల్లో 28; 4 ఫోర్లు) కాసేపు పోరాడాడు. అయితే స్వల్ప వ్యవధిలోనే మెహదీ హసన్‌ (9)తో పాటు లిటన్‌ దాస్‌ కూడా పెవిలియన్‌ చేరడంతో బంగ్లా 53 పరుగులకే 5 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో షమీమ్‌ (34 బంతుల్లో 42 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), జాకీర్‌ అలీ (34 బంతుల్లో 41 నాటౌట్‌; 2 ఫోర్లు) రాణించారు. 

మరో వికెట్‌ పడకుండా జట్టు స్కోరును వంద పరుగులు దాటించారు. అనంతరం సులువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 14.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లలో కుశాల్‌ మెండిస్‌ (3) నిరాశ పరచగా, నిసాంక (34 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీ సాధించాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కమిల్‌ మిషార (32 బంతుల్లో 46 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి నిసాంక రెండో వికెట్‌కు 95 పరుగులు జోడించాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement