విజయ డెయిరీ పాలు | - | Sakshi
Sakshi News home page

విజయ డెయిరీ పాలు

May 23 2026 9:29 AM | Updated on May 23 2026 9:29 AM

ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు

బడిలోనే బ్రేక్‌ఫాస్ట్‌

మెదక్‌అర్బన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 2026– 27 విద్యా సంవత్సరం నుంచి అల్పాహారంతో పాటు పాలు అందివ్వనున్నారు. ఈ మేరకు ఇటీవల రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు సైతం కేటాయించారు. పథకం అమలు దిశగా చర్యలు చేపడుతున్నారు. దీంతో నిరుపేద పిల్లలకు పౌష్టికాహారంతో పాటు ఆకలి బాధలు తీరనున్నాయి. చుట్టు పక్కల గ్రామాల నుంచి హైస్కూల్‌ చదువుల కోసం కాలినడకన వచ్చే విద్యార్థులకు ఈ పథకం ప్రయోజనకరంగా మారనుంది. తద్వారా డ్రాపౌట్స్‌ తగ్గే అవకాశం ఉంది.

2,55,059 విద్యార్థులకు ప్రయోజనం

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జూన్‌ నుంచి అల్పాహారంతో పాటు పాలు అందించే దిశగా అడుగులు పడుతున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో 2,55,059 విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు. ముఖ్యంగా హైస్కూళ్లు చిన్న గ్రామాల్లో ఉండకపోవడం, బస్సు సౌకర్యాల లేమితో చాలా మంది విద్యార్థులు కాలినడకన కాలే కడుపుతో ఉదయం పూట బడికి వస్తుంటారు. వారికి ఈ పథకం ఆకలి తీర్చడంతో పాటు ఆరోగ్యాన్ని అందివ్వనుంది.

జిల్లా పాఠశాలలు విద్యార్థులు

మెదక్‌ 881 68,219

సిద్దిపేట 935 80,541

సంగారెడ్డి 1,222 1,06,299

Advertisement
 
Advertisement
Advertisement