ఆదాయపు పన్ను చట్టం మరింత సరళీకృతం | - | Sakshi
Sakshi News home page

ఆదాయపు పన్ను చట్టం మరింత సరళీకృతం

May 23 2026 9:29 AM | Updated on May 23 2026 9:29 AM

సిద్దిపేటకమాన్‌: నూతన ఆదాయపు పన్ను చట్టం ద్వారా పన్ను విధానాలు మరింత సరళీకృతం అవుతాయని, పారదర్శకత పెరుగుతుందని ఇన్‌కమ్‌ట్యాక్స్‌ జాయింట్‌ కమిషనర్‌ రాకేష్‌ అన్నారు. సిద్దిపేట పట్టణంలో పన్ను చెల్లింపుదారులకు, ట్యాక్స్‌ ప్రాక్టీషనర్లు, ట్రేడ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులకు శుక్రవారం అవగహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాకేశ్‌ మాట్లాడుతూ.. నూతన ఆదాయపు పన్ను చట్టం కొత్త నిబంధనలు, విధానాలపై వివరించారు. పన్ను చెల్లింపుదారులకు సులభమైన పారదర్శకత, సాంకేతిక ఆధారిత సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు రవికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement