‘ఉపాధి’ పనులు పక్కాగా నిర్వహించాలి

పనుల వివరాలు తెలుసుకుంటున్న
కౌసల్య దేవి  - Sakshi

డీఆర్‌డీఏ అదనపు పీడీ కౌసల్య దేవి

దుబ్బాకరూరల్‌: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పక్కాగా నిర్వహించాలని డీఆర్‌డీఏ అదనపు పీడీ కౌసల్య దేవి అన్నారు. సోమవారం దుబ్బాక ఎంపీపీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన సామాజిక తనిఖీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో జరిగిన ఉపాధి పనులపై ఈజీఎస్‌ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హరితహారం, పల్లె ప్రకృతివనాలు, డంప్‌యార్డులు, శ్మశాన వాటికలు, క్రీడాప్రాంగణాలతో పాటు 36 అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాబ్‌ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి పని కల్పించాలని, ఉపాధి పనుల్లో అవకతవకలు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. పెండింగ్‌ పనులను త్వరగా పూర్తి చేయాలని, వేసవిలో మొక్కలు ఎండిపోకుండా సంరక్షణ ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ చంద్రమోహన్‌రెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలత, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, ఎంపీడీఓ భాస్కరశర్మ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Siddipet News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top