సంగారెడ్డిటౌన్: జిల్లా జైలులో ఖైదీలకు మంచి నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య పేర్కొన్నారు. కందిలోని సెంట్రల్ జైలు, గిర్మాపూర్లోని సోషల్ వెల్పేర్ హస్టల్ను బుధవారం ఆకస్మిక తనీఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జైలులోని ఖైదీలకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామన్నారు. అనంతరం వంటగది, భోజనశాలను పాఠశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జైలు సిబ్బంది న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా న్యాయసేవాధికార
సంస్థ కార్యదర్శి సౌజన్య


