
బైక్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ఒకరి పరిస్థితి విషమం
హవేళిఘణాపూర్(మెదక్): మెదక్ నుంచి వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం.. హవేళిఘణాపూర్ పోలీస్స్టేషన్ల పరిధిలో ఔరంగాబాద్ గేటు వద్ద వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వస్తున్న అవుసులపల్లికి చెందిన గొల్ల సిద్దయ్య కిందపడడంతో బలమైన గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని మెదక్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేశ్ తెలిపారు.