టాక్స్‌ చెల్లించకుంటే జరిమాన | - | Sakshi
Sakshi News home page

టాక్స్‌ చెల్లించకుంటే జరిమాన

Jun 27 2025 6:26 AM | Updated on Jun 27 2025 6:28 AM

టాక్స్‌ చెల్లించకుంటే జరిమాన

టాక్స్‌ చెల్లించకుంటే జరిమాన

● 200 బస్సులకు సామర్థ్య పరీక్షలు ● జహీరాబాద్‌ ఎంవీఐ వెంకటయ్య

జహీరాబాద్‌ టౌన్‌:

సాక్షి: జహీరాబాద్‌ డివిజన్‌ పరిధిలో ఎన్ని స్కూల్‌ బస్సులు ఉన్నాయి. బస్సుల ఫిట్‌నెస్‌ పరీక్షలు పూర్తయ్యాయా?

ఎంవీఐ: జహీరాబాద్‌ డివిజన్‌ పరిధిలో జహీరాబాద్‌, నారాయణఖేడ్‌ నియోజకవర్గాలు వస్తాయి. డివిజన్‌ వ్యాప్తంగా 218 ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులున్నాయి. ఇప్పటి వరకు 200 బస్సులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించాం. మిగిలిన బస్సులకు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నాం.

సాక్షి: నిబంధనలు పాటించకుంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

ఎంవీఐ: నిబంధనలు పాటించని బస్సులను సీజ్‌ చేస్తాం. ఫిట్‌నెస్‌తోపాటు టాక్స్‌ కట్టని బస్సులకు రూ.5 వేల వరకు జరిమాన విధిస్తాం.

సాక్షి: ఆటోల్లో పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లవచ్చా?

ఎంవీఐ: నిబంధన ప్రకారం ఆటోలో విద్యార్థులను తీసుకెళ్లకూడదు. తప్పని పరిస్థితుల్లో మాత్రమే సామర్థ్యం మేరకు పిల్లలను కూర్చో బెట్టాలి. స్కూల్‌ ట్రిప్‌ అని ముందు వెనుక రాయాలి. నిబంధనలు పాటించకుండా నడిపితే కేసులు పెడతాం.

సాక్షి: డ్రైవర్లు ఎలాంటి నిబంధనలు పాటించాలి?

ఎంవీఐ: డ్రైవర్‌కు కనీసం 5 ఏళ్ల అనుభవం ఉండాలి. వయసు 60 సంవత్సరాల లోపు ఉండాలి. తప్పనిసరి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. డ్రైవర్‌కు కచ్చితంగా సహాయకుడు ఉండాలి. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి.

ఎం.వెంకటయ్య, ఎంవీఐ, జహీరాబాద్‌

సాక్షి: బస్సుల ఫిట్‌నెస్‌ సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏంటి?

ఎంవీఐ: బస్సు పూర్తిగా కండిషన్‌లో ఉండాలి. బస్సు టైర్లు, బ్రేకులు, సీట్లు, ఫుట్‌బోర్డు, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌, పాఠశాల రిజిస్ట్రేషన్‌ తదితర అంశాలను పరిశీలిస్తాం. బస్సుపై పాఠశాల పేరు, సెల్‌ఫోన్‌ నంబర్‌ కచ్చితంగా ఉండాలి. నిబంధనలు పాటించకుంటే బస్సులకు అనుమతులు ఇవ్వం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement