
మోదీ పాలన స్వర్ణయుగం
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ
మెదక్జోన్: ప్రధాని మోదీ పదకొండేండ్ల పాలన స్వర్ణయుగమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. గురువారం మెదక్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ 6 దశాబ్దాల పాటు దేశాన్ని పాలించి చేసిందేమి లేదని విమర్శించారు. మహిళలు, విద్యార్థులు, యువకుల అభివృద్ధి కోసం మోదీ ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చారన్నారు. రోడ్డు, వాయు మార్గాలు, వందేభారత్ రైళ్లతో పాటు దేశశ భద్రత విషయంలో ప్రపంచ దేశాలకు తెలిసి వచ్చేలా భారత్ సత్తాను ఆపరేషన్ సిందూర్ ద్వారా చూపించాడన్నారు. రైతు అభివృద్ధే ధ్యేయంగా రైతు పండించిన ఉత్పత్తులకు మద్దతు ధర, పెట్టుబడుల కోసం కిసాన్సమ్మాన్ నిధి అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశంగౌడ్, మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా మాజీ అధ్యక్షుడు విక్రమ్రెడ్డి, స్థానిక నేతలు ఎంఎల్ఎన్ రెడ్డి, సుభాష్గౌడ్, సత్యనారాయణ, రాములు, సతీష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.