కలెక్టర్‌గా ప్రావీణ్య బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌గా ప్రావీణ్య బాధ్యతల స్వీకరణ

Jun 14 2025 10:22 AM | Updated on Jun 14 2025 10:22 AM

కలెక్

కలెక్టర్‌గా ప్రావీణ్య బాధ్యతల స్వీకరణ

సంగారెడ్డి జోన్‌: జిల్లా నూతన కలెక్టర్‌గా ప్రావీణ్య శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. ముందుగా ఐబీ గెస్ట్‌ హౌస్‌కు వచ్చిన కలెక్టరుకు అదనపు కలెక్టరు చంద్రశేఖర్‌, సంగారెడ్డి ఆర్డీఓ రవీందర్‌రెడ్డి పూల మొక్కలను అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం నేరుగా కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకుని తన చాంబర్‌లో బాధ్యతలను స్వీకరించారు. వివిధ శాఖల అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పద్మజారాణి, సాయిబాబా, జ్యోతి, అఖిలేశ్‌రెడ్డి, ఐనేశ్‌, వెంకటేశ్వర్లు, లలితకుమారి పాల్గొన్నారు.

మంత్రి వాకిటికి

ఎంపీ షెట్కార్‌ సన్మానం

నారాయణఖేడ్‌: రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు, యువజన శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వాకిటి శ్రీహరిని శుక్రవారం జహీరాబాద్‌ ఎంపీ సురేశ్‌ షెట్కార్‌ హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ మినిస్టర్‌ క్వార్టర్స్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వాకిటిని శాలువాతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్ఛాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిగా మంత్రి ఎంపీని సత్కరించారు. మంత్రిగా రాష్ట్ర అభివృద్ధిలో కీలపాత్ర పోషించాలని, జహీరాబాద్‌ పార్లమెంట్‌, ఖేడ్‌ అసెంబ్లీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎంపీ ఆకాంక్షించారు. ఎంపీ షెట్కార్‌ వెంట జిల్లా దిశ కమిటీ సభ్యులు ప్రకాశ్‌ రాథోడ్‌, నాయకులు హన్మంత్‌రావు, పీకే రావు, రవి ఉన్నారు.

అదనపు డీఆర్డీఓ బదిలీ

సంగారెడ్డి టౌన్‌: సంగారెడ్డిలో జిల్లాలో అదనపు డీఆర్డిఓగా విధులు నిర్వహించిన జంగారెడ్డి శుక్రవారం బదిలీపై యాదాద్రి భువనగిరి జిల్లాకు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన అదనపు డీఆర్డీఓ సూర్యారావు రానున్నారు.

పెట్టుబడిదారుల కోసమే

లేబర్‌ కోడ్‌లు

సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు

పటాన్‌చెరు టౌన్‌: శ్రామికుల శ్రమను దోచుకునేందుకే కేంద్రం లేబర్‌ కోడ్‌లను పెట్టుబడిదారుల కోసం అమలు చేస్తుందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు ఆరోపించారు. పటాన్‌చెరు పట్టణంలోని శ్రామిక భవన్‌లో శుక్రవారం జరిగిన సీఐటీయూ కార్యకర్తల సమావేశంలో చుక్కా రాములు మాట్లాడుతూ....జూలై 9 న జరిగే దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఎనిమిది గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచుతూ లేబర్‌ కోడ్స్‌లో పొందు పరిచారని, కనీస వేతనాలు, పీఎఫ్‌ ఈఎస్‌ఐ, బోనస్‌ వంటి సదుపాయాలు అందని ద్రాక్షగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

సార్వత్రిక సమ్మెను

జయప్రదం చేయాలి

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని బలిచ్చే నాలుగు లేబర్‌ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ జూలై 9 న నిర్వహించే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని సుందరయ్య భవన్‌ సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ముఖ్య కార్యకర్త సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ...కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో 4 లేబర్‌ కోడ్‌లను తెచ్చిందన్నారు. పెట్టుబడిదారీ ప్రయోజనాల కోసమే ఈ చట్టాలను తెచ్చారని ఆరోపించారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ కోడ్స్‌ అమలు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, కార్మిక వర్గానికి నష్టం చేసే నాలుగు లేబర్‌ కోడ్స్‌ వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

కలెక్టర్‌గా ప్రావీణ్య  బాధ్యతల స్వీకరణ1
1/2

కలెక్టర్‌గా ప్రావీణ్య బాధ్యతల స్వీకరణ

కలెక్టర్‌గా ప్రావీణ్య  బాధ్యతల స్వీకరణ2
2/2

కలెక్టర్‌గా ప్రావీణ్య బాధ్యతల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement