
వెంట పడుతున్నాడని.. చంపేశారు
సిద్దిపేటఅర్బన్: అడ్డా కూలీని కొట్టి చంపిన హత్య కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈనెల 8న రంగధాంపల్లి పరిధిలోని మయూరి దాబా వెనక ఖాళీ స్థలంలో బోదాసు నర్సింహులు హత్యకు గురైన విషయం తెలిసిందే. గురువారం పోలీస్ స్టేషన్లో త్రీటౌన్ సీఐ విద్యాసాగర్ కేసు వివరాలు వెల్లడించారు. పట్టణంలో నివాసం ఉండే గ్యాదరి శ్రీదేవికి పెద్దపల్లి జిల్లా రత్నాపూర్కు చెందిన ఇట్టవేని సతీష్తో కల్లు దుకాణంలో పరిచయం ఏర్పడింది. ఇద్దరు చనువుగా ఉంటున్నారు. ఇదే క్రమంలో తొగుట మండలం పెద్ద మాసాన్పల్లికి చెందిన నర్సింహులు సైతం శ్రీదేవికి పరిచయం కాగా వెంటడేవాడు. దీంతో శ్రీదేవి విషయాన్ని సతీష్తో చెప్పింది. ఓ రోజు మద్యం తాగుతున్న సమయంలో శ్రీదేవికి సతీష్ పెళ్లి ప్రతిపాదన చేయగా ఒప్పుకుంది. కానీ, నర్సింహులు వెంట పడుతుండటంతో అతడిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 7న రాత్రి సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద శ్రీదేవిని నర్సింహులు కలిసి కల్లు తాగుదామని పిలిచాడు.అదే సమయంలో సతీష్ కూడా వచ్చాడు. రంగధాంపల్లి వద్ద దావత్ ఉందని ముగ్గురం కలిసి వెళ్దామని నర్సింహులును శ్రీదేవి నమ్మించింది. అక్కడి నుంచి వెళ్లి ముగ్గురు కలిసి మద్యం తాగారు. పథకం ప్రకారం గొడవపడి సతీష్ నర్సింహులును ఛాతీపై, ముఖంపై పిడి గుద్దులు గుద్ది, తల వెనక భాగంలో కొట్టగా మృతి చెందాడు. కేసును ఛేదించిన త్రీటౌన్ సీఐ విద్యాసాగర్, సిబ్బందిని ఏసీపీ రవీందర్రెడ్డి అభినందించారు.
మద్యం తాగించి కొట్టిన వైనం
నిందితుల రిమాండ్
వివరాలు వెల్లడించిన త్రీటౌన్ సీఐ