దొంగతనానికి వెళ్లి సెక్యూరిటీ గార్డు హత్య | - | Sakshi
Sakshi News home page

దొంగతనానికి వెళ్లి సెక్యూరిటీ గార్డు హత్య

Jun 13 2025 7:19 AM | Updated on Jun 13 2025 7:19 AM

దొంగతనానికి వెళ్లి సెక్యూరిటీ గార్డు హత్య

దొంగతనానికి వెళ్లి సెక్యూరిటీ గార్డు హత్య

పటాన్‌చెరుటౌన్‌: దొంగతనానికి వెళ్లి సెక్యూరిటీ గార్డును హత్య చేసిన నిందితుల్లో ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో డీఎస్పీ ప్రభాకర్‌ కేసు వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన కై రత్‌మియా (53) పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని ఉష మాగ్‌ వైర్స్‌ ఇండియా ప్రయివేట్‌ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ ఇస్నాపూర్‌లో ఉంటున్నాడు. అయితే బొంతపల్లికి చెందిన పెయింటర్లు బిట్టు, మహమ్మద్‌ మాజీద్‌, రోషన్‌ కుమార్‌, మహమ్మద్‌ సద్దాం, వికాస్‌ కుమార్‌, నర్సింగరావు, వినీత్‌ కుమార్‌తో పాటు ఓ బాలుడు కలిసి పనిచేసే చోట క్రికెట్‌ ఆడేవారు. ఈ నేపథ్యంలో పరిచయం ఏర్పడి మద్యం తాగుతూ జల్సాలకు అలవాటుపడ్డారు. పనిచేస్తే వచ్చే డబ్బులు జల్సాలకు సరిపోవడం లేదని, దొంగతనం చేద్దామని పతకం రచించారు. ఈ క్రమంలో ఏప్రిల్‌ 16న అర్ధరాత్రి ఉష మాగ్‌ వైర్స్‌ కంపెనీలో కాపర్‌ వైర్‌ దొంగిలించే ముందు మద్యం తాగారు. ప్లాన్‌ ప్రకారం బొలెరో వాహనం, నంబర్‌ప్లేట్‌ లేని ద్విచక్ర వాహనం తీసుకుని 8 మంది దొంగతనానికి వెళ్లారు. దొంగతనం చేస్తున్న క్రమంలో సెక్యూరిటీ గార్డు కై రత్‌ మియా గమనించి టార్చ్‌ వేసి చూశాడు. దీంతో అతడి తలపై కరల్రతో కొట్టడంతో గట్టిగా అరిచాడు. స్థానికంగా ఉన్న లేబర్‌ రావడంతో అక్కడి నుంచి అందరూ పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన సెక్యూరిటీ గార్డును పటాన్‌చెరులోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఏప్రిల్‌ 23న మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక పోలీసులు, సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తులో భాగంగా మొబైల్‌ ఫోన్లు,. సీసీ కెమెరాలు పరిశీలించి రోషన్‌ కుమార్‌ని అదుపులోకి తీసుకొని విచారించగా నిందితుల వివరాలు వెల్లడించాడు. బాలుడు, బిట్టు అనే నిందితులు పరారు కాగా, మిగతా వారిని అరెస్టు చేసి రమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన వాహనం, సెల్‌ఫోన్‌లు, కర్రలను స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదించిన సీసీఎస్‌ సీఐ శివకుమార్‌, బీడీఎల్‌ సీఐ స్వామి గౌడ్‌, సీసీఎస్‌ సీఐ –2 రామానాయుడు, ఎస్‌ఐలు శ్రీకాంత్‌, లక్ష్మారెడ్డి, మహేశ్వర్‌ రెడ్డి తోపాటు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

ఆరుగురు నిందితుల రిమాండ్‌

పరారీలో ఇద్దరు

వివరాలు వెల్లడించిన డీఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement