వందరోజుల కార్యాచరణ అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

వందరోజుల కార్యాచరణ అమలు చేయాలి

Jun 13 2025 7:19 AM | Updated on Jun 13 2025 7:19 AM

వందరోజుల కార్యాచరణ అమలు చేయాలి

వందరోజుల కార్యాచరణ అమలు చేయాలి

సదాశివపేట(సంగారెడ్డి): మున్సిపాలిటీ ప్రగతి పారిశుద్ధ్యం మెరుగు పరచడంతోపాటు పట్టణాల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన వందరోజుల కార్యాచరణ ప్రణాళికను అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని సీడీఎంఏ కార్యాలయం అదనపు డైరక్టర్‌ గిరిశ్రీవాస్తవ అధికారులను సూచించారు. మున్సిపల్‌ డీఎంఏ ఆదేశాల మేరకు గిరిశ్రీవాస్తవ, రిటైర్డ్‌ కమిషనర్‌ ఇస్వాక్‌అబ్‌ఖాన్‌ గురువారం మున్సిపల్‌ పరిధిలో పర్యవేక్షించారు. పట్టణంలో ఊబచెరువుపై అమృత 2.0లో భాగంగా మొక్కలు నాటి, గాంధీచౌక్‌ వద్ద ఉన్న పబ్లిక్‌ టాయిలెట్‌ని పరిశీలించారు. అనంతరం శాసీ్త్రరోడ్‌లోని దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి ట్రెడ్‌ లైసెన్స్‌లను తనిఖీ చేశారు. వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. అనంతరం ఎస్‌హెచ్‌జీ మహిళలకు రూ.కోటి చెక్కును అందజేశారు. మహిళలు రుణాలను సద్వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ జే.ఉమా, ఏఈ రాజేశ్‌కుమార్‌, మేనేజర్‌ ఉమిందర్‌సింగ్‌, ఇన్‌చార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌, పర్యావరణ అధికారి అశోక్‌, సీఓ రమాదేవి, ఎస్‌హెచ్‌జీ మహిళలు మున్సిపల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌హెచ్‌జీ మహిళలకు రూ.కోటి చెక్కు అందజేత

సీడీఎంఏ కార్యాలయం అదనపు డైరెక్టర్‌ గిరిశ్రీవాస్తవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement