ప్రజల పక్షాన పోరాడితే గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

ప్రజల పక్షాన పోరాడితే గుర్తింపు

Dec 28 2025 12:47 PM | Updated on Dec 28 2025 12:47 PM

ప్రజల పక్షాన పోరాడితే గుర్తింపు

ప్రజల పక్షాన పోరాడితే గుర్తింపు

కడ్తాల్‌: పంచాయతీ ఎన్నికల్లో యువజన సంఘాల ఐక్యవేదిక నుంచి తనతో పాటు వసంత, పూలమ్మ వార్డు సభ్యులుగా విజయం సాధించారని యువజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోళ్ల రాఘవేందర్‌ అన్నారు. శనివారం ఆయన రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య, టీఆర్‌పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నను వేర్వేరుగా కలిశారు. ఈ సందర్భంగా వారిని సన్మానించారు. పోరాటం చేసే వారిని ప్రజలు గుర్తిస్తారని, నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రజల అభిమానాన్ని మరింత చూరగొనాలని, భవిష్యత్‌లో గొప్ప నాయకుడిగా ఎదగాలని ఐక్యవేదిక అధ్యక్షుడు రాఘవేందర్‌ను, రాజ్యసభ సభ్యులు కృష్ణయ్య ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు మాధవులు, నాయకులు ఎర్రోళ్ల వెంకటేశ్‌, నాగరాజు, కృష్ణ, నాగార్జున, బాలకృష్ణ, మహేశ్‌, సంజయ్‌, సందీప్‌, బాలకృష్ణ తదితరులు ఉన్నారు.

రాజ్యసభ్యుడు ఆర్‌.కృష్ణయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement