భార్యాభర్తలు వార్డు సభ్యులుగా గెలుపు
భర్తకు ఉప సర్పంచ్గా అవకాశం
ఇబ్రహీంపట్నం రూరల్: భార్య భర్తలు వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. భర్తకు ఉప సర్పంచ్ పదవీ వరించింది. ఇబ్రహీంపట్నం మండలంలోని పోల్కంపల్లి గ్రామంలో ప్రజలు వినూత్న తీర్పు ఇచ్చారు. అదే గ్రామానికి చెందిన కావలి వెంకటేష్, సుధారాణి దంపతులు పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యులుగా పోటీలో నిలిచారు. భర్త వెంకటేష్ 4వ వార్డు సభ్యులుగా, భార్య సుధా 7వ వార్డు సభ్యులుగా బరిలో నిలిచారు. బీఆర్ఎస్ ప్యానెల్లో ఇద్దరు విజయం సాధించారు. దీంతో భర్త వెంకటేష్కు ఉప సర్పంచ్గా అవకాశం వచ్చింది.
మూడు సార్లు వార్డు సభ్యునిగా గెలిచిన రమేశ్..
ఇబ్రహీంపట్నం మండలంలోని పోచారం గ్రామంలో గొరిగే రమేశ్ 1వ వార్డు సభ్యునిగా పోటీ చేసి గెలుపొందాడు. దీంతో అతను మూడు సార్లు గెలుపొంది హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకున్నారు.
బాలుడిపై వీధి కుక్క దాడి
తుర్కయంజాల్: సర్కిల్ పరిధిలోని పలు కాలనీల్లో కుక్కలు గుంపులుగా తిరుగుతూ స్వైర విహారం చేస్తున్నాయి. శుక్రవారం కమ్మగూడలోని ఇందిరమ్మ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న కాట్రావత్ సంజయ్ అనే బాలుడిపై ఓ వీధి కుక్క దాడి చేసింది. గాయాలపాలైన చిన్నారిని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.
భార్యాభర్తలు వార్డు సభ్యులుగా గెలుపు


