కలం తీసుకో.. రాత మార్చుకో | - | Sakshi
Sakshi News home page

కలం తీసుకో.. రాత మార్చుకో

Oct 20 2025 9:28 AM | Updated on Oct 20 2025 9:28 AM

కలం తీసుకో.. రాత మార్చుకో

కలం తీసుకో.. రాత మార్చుకో

మొయినాబాద్‌: బ్రహ్మదేవుడు ఎవరి తలరాత ఎలా రాస్తాడో ఎవరికీ తెలియదు.. కానీ చిలుకూరు బాలాజీ సన్నిధిలో పెన్ను తీసుకుని నీ తలరాతను నువ్వే మార్చుకో అని అంటున్నారు అర్చకుడు సురేష్‌స్వామి. ఆదివారం ఆయన ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో స్వామివారి దర్శనం అనంతరం పిల్లలకు పెన్నులు కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దైవ దర్శనానికి వచ్చిన చిన్నారులకు స్వామివారి ప్రసాదంగా పెన్నులు అందజేస్తే.. వారికి విశ్వాసం పెరిగి, చదువుపై మమకారం పెరుగుతుందని, అందుకే కొంత కాలంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాని తెలిపారు. ఆలయాల్లో బాలబాలికలకు ప్రాధాన్యత పెరగాలని.. దేశ భవిష్యత్‌కు వారే నిర్మాతలవుతారని ఆకాంక్షింస్తున్నామని పేర్కొన్నారు.

బాలాజీ సన్నిధిలో పెన్నుల పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement