వీర్నపల్లి: మండలంలో జవహర్లాల్నాయక్ తండా పరిధి భంగీరెడ్డితండాకు చెందిన దివ్యాంగురాలు భూక్యా సక్కుబాయి జాతీయస్థాయి పారా అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ చాటారు. ఈ నెల 17 నుంచి 21 వరకు ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లో నిర్వహించిన 24వ నేషనల్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఎఫ్40 కేటగిరీ షాట్పుట్ పోటీలో 12వ స్థానాన్ని కై వసం చేసుకున్నారు. సక్కుబాయి దివ్యాంగురాలైనప్పటికీ పట్టుదలతో శ్రమించి, జాతీయ స్థాయిలో జిల్లా పేరు నిలబెట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


