వివిధ సమస్యలపై 179 దరఖాస్తులు
ప్రజావాణి అర్జీలు సకాలంలో పరిష్కరించాలి
కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల అర్బన్: క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో పలువురు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సోమవారం కలెక్టరేట్కు తరలివచ్చారు. ప్రజావాణిలో తమ సమస్యలను కలెక్టర్కు విన్నవించి.. పరిష్కరించాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై 179 మంది తమ దరఖాస్తులను జిల్లా అధికారులకు అందజేశారు. అర్జీలు స్వీకరించిన కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని అధి కారులను ఆదేశించారు. పెండింగ్లో పెట్టవద్దని, ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. అన్ని శాఖల అధికారులు విధిగా ప్రజావాణికి హాజరుకావాలని స్పష్టం చేశారు.


