యాదగిరిగుట్టకు బస్సు నడపాలి | - | Sakshi
Sakshi News home page

యాదగిరిగుట్టకు బస్సు నడపాలి

Mar 24 2023 5:46 AM | Updated on Mar 24 2023 5:46 AM

సజ్జనార్‌కు వినతిపత్రం ఇస్తున్న బాల్‌రాజ్‌ యాదవ్‌ - Sakshi

సజ్జనార్‌కు వినతిపత్రం ఇస్తున్న బాల్‌రాజ్‌ యాదవ్‌

● ఎండీ సజ్జనార్‌కు
మాజీ ఎంపీటీసీ వినతి

ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): సిరిసిల్ల డిపో నుంచి ఎల్లారెడ్డిపేట మీదుగా యాదగిరిగుట్ట, హైదరాబాద్‌కు బస్సును నడిపించాలని గురువారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాల్‌రాజ్‌ యాదవ్‌ వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో ఎండీ సజ్జనార్‌ను కలిసి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎల్లారెడ్డిపేట నుంచి మాచారెడ్డి, కామారెడ్డి మీదుగా హైదరాబాద్‌కు, మరో బస్సును ఎల్లారెడ్డిపేట నుంచి ముస్తాబాద్‌, సిద్దిపేట మీదుగా యాదగిరిగుట్టకు బస్సులు నడపాలను కోరారు. ప్రతి ఆదివారం కొమురవెళ్లి దేవస్థానానికి నడిపించాలన్నారు. అందుకు ఎండీ సజ్జనార్‌ సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. రూటు సర్వేకు అధికారులను అదేశించినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement