అసలు పంటల నష్టం ఇదీ...
గత నెల 26 నుంచి మోంథా తుపాను ప్రారంభమైంది. 27, 28 తేదీల్లో భారీవర్షం కురిసింది. 28వ తేదీ ఒక్క రోజులోనే గత 15 సంవత్సరాలుగా ఏనాడూ లేని విధంగా 25.68 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. తుపానుకు మొత్తం 90 వేలకు పైగా ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. అందులో ప్రధానంగా పత్తి 35 వేల ఎకరాల్లో అన్నదాతలు దెబ్బతిన్నారు. వరి 9,500 ఎకరాలు, కంది 7 వేల ఎకరాలు, మినుము 7600 ఎకరాలు, సజ్జ 7300 ఎకరాలు, మొక్కజొన్న 7,100 ఎకరాలు, అనుములు 5,600 ఎకరాలు, పొగాకు 5200 ఎకరాలు, మిర్చి 4,700 ఎకరాలు, నువ్వు 2500 ఎకరాలు, జొన్న, వేరుశనగ, పెసర, బొబ్బరు, కొర్ర, ఆముదం, అలసందతో పాటు ఉద్యానవన పంటలు 3 వేల ఎకరాల్లో (పూల తోటలు, అరటి, బొప్పాయి, పుచ్చ, ఉల్లి, తమలపాకు తోటలు, కూరగాయల తోటలు) ఉన్నాయి.


