
నష్టపరిహారం కోసం బాధితుల ఆందోళన
● పోలీసులకు, బాధితులకు మధ్య
వాగ్వివాదం
సింగరాయకొండ: ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడు, ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించాలంటూ ఆదివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పొట్టేళ్ల జగదీష్కుమార్ బంధువులు, స్నేహితులు పోలీస్స్టేషన్కు చేరుకుని ఎస్సై బి.మహేంద్రను డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులకు, బాధితులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటకు కారణమైన వ్యక్తిని పట్టుకునే క్రమంలో ఇద్దరు పోలీసులకు స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి ఒకరిపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదానికి కారకుడైన ఉలవపాడు మండలం మన్నేటికోట గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ వంకాయలపాటి కోటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.