నష్టపరిహారం కోసం బాధితుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

నష్టపరిహారం కోసం బాధితుల ఆందోళన

Jun 10 2025 6:53 AM | Updated on Jun 10 2025 6:53 AM

నష్టపరిహారం కోసం బాధితుల ఆందోళన

నష్టపరిహారం కోసం బాధితుల ఆందోళన

పోలీసులకు, బాధితులకు మధ్య

వాగ్వివాదం

సింగరాయకొండ: ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడు, ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించాలంటూ ఆదివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పొట్టేళ్ల జగదీష్‌కుమార్‌ బంధువులు, స్నేహితులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఎస్సై బి.మహేంద్రను డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులకు, బాధితులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటకు కారణమైన వ్యక్తిని పట్టుకునే క్రమంలో ఇద్దరు పోలీసులకు స్వల్పగాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి ఒకరిపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదానికి కారకుడైన ఉలవపాడు మండలం మన్నేటికోట గ్రామానికి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ వంకాయలపాటి కోటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement