‘కమీషన్లు, ముడుపులు.. ‘దారి’తప్పిన టీడీపీ ఎమ్మెల్యేలు’ | Ysrcp Mp Vijayasai Reddy Tweet On Tdp Mlas | Sakshi
Sakshi News home page

‘కమీషన్లు, ముడుపులు.. ‘దారి’తప్పిన టీడీపీ ఎమ్మెల్యేలు’

Oct 10 2024 3:24 PM | Updated on Oct 10 2024 4:21 PM

Ysrcp Mp Vijayasai Reddy Tweet On Tdp Mlas

టీడీపీ ఎమ్మెల్యేల అవినీతిపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఏపీలో కమీషన్లు, ముడుపులు, దందాలతో టీడీపీ ఎమ్మెల్యేలు దారితప్పారంటూ ట్వీట్‌ చేశారు.

సాక్షి, తాడేపల్లి: టీడీపీ ఎమ్మెల్యేల అవినీతిపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఏపీలో కమీషన్లు, ముడుపులు, దందాలతో టీడీపీ ఎమ్మెల్యేలు దారితప్పారంటూ ట్వీట్‌ చేశారు. 90 శాతం మంది టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి పరాకాష్టకు చేరడంతో నాలుగు నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేక ప్రభావం పడిందన్న విజయసాయి.. పోస్టింగులకు ఒక రేటు, మద్యంలో నెలమామూళ్లు, వెంచర్లలో కమీషన్లు, కాంట్రాక్టర్ల దగ్గర పెర్సెంటేజిలు, ప్రొటెక్షన్ మనీ, అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు బరితెగించారంటూ దుయ్యబట్టారు.

‘‘గత ప్రభుత్వ హయాంలో టీడీపీ గూఢచారులుగా ప్రవర్తించిన అధికారులకు క్లీన్‌ చిట్‌లు, మంచిరాబడి ఉన్న పోస్టింగులు, పదోన్నతులు. మద్యంషాపుల దరఖాస్తుల్లో టీడీపీ ఎమ్మెల్యేలు సిండికేట్ అయ్యి సర్కార్ ఖజానాకు  గండి. లిటిగేషన్లు, నోటిదురుసులు, వ్యభిచారాలు, ఆమ్యామ్యాలు, మాఫియాలు, దందాలు, బ్లాక్మెయిలింగ్, వెంచర్లు, మద్యం.. దేన్నీ వదలకుండా టీడీపీ ప్రజాప్రతినిధులు అడ్డగోలుగా దిగమింగే దాంట్లో పూర్తి నిమగ్నం’’ అంటూ టీడీపీ నేతల్ని విజయసాయిరెడ్డి ఏకిపారేశారు.

ఇదీ చదవండి: చంద్రబాబుకి నిజం అంటే భయం.. అందుకే : 

‘‘ఐదు సంవత్సరాల తర్వాత అవకాశం దొరికినప్పుడు మేం మింగితే తప్ప్పేమిటి.. మళ్ళీ మళ్ళీ  అవకాశం వస్తుందో రాదో అని అడ్డంగా సమర్ధించుకుంటున్న తెలుగు తమ్ముళ్లు. టీడీపీ ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలఫై చంద్రబాబు స్పందించి సమాధానం చెప్పాలి. లేనట్లయితే ప్రజాభీష్టం మేరకు శ్వేతపత్రం సమర్పించి విచారణకు ఆదేశించాలి’’ అని ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement