‘ఏపీని రావణకాష్టంగా మార్చారు’ | YSRCP Leader Anil Kumar Slams AP Govt | Sakshi
Sakshi News home page

‘ఏపీని రావణకాష్టంగా మార్చారు’

Feb 3 2026 10:43 AM | Updated on Feb 3 2026 11:43 AM

YSRCP Leader Anil Kumar Slams AP Govt

నెల్లూరు: ఏపీని రావణకాష్టంగా మార్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అనిల్‌కుమార్‌ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ నేతలు వరుసగా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతూ ఆటవిక పాలనకు తెరలేపారన్నారు. మరో మూడేళ్లపాటు ఆటవిక పాలన భరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 

 ‘సాక్షి’తో అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. ‘ కాపు, బీసి నాయకులపై దాడులు శోచనీయం. శ్రీవారి లడ్డు ప్రసాదం దుష్ప్రచారంలో దొరికేసిన కూటమి నాయకులుఉ.. డైవర్షన్ కోసమే దాడులకు పాల్పడుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫ్రస్టేషన్‌లో ఉన్నారు. దమ్ముంటే పోలీసు వ్యవస్థను పక్కన బెట్టి సవాలు విసరండి. మరో మూడేళ్లు ఈ ఆటవిక పరిపాలన భరిస్తాం. 2029లో రిటర్న్‌ గిఫ్ట​ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాం’ అని హెచ్చరించారు.

ఇదే విద్వాంస పాలన మీరు కోరుకుంటే.. సినిమా స్టైల్ లో  అనిల్ కుమార్ వార్నింగ్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement