చంద్రబాబుపై టీడీపీ సీనియర్ నేత ఫైర్‌ | Vadde Sobhanadreeswara Rao Shocking Comments On Chandrababu Naidu, More Details Inside | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై టీడీపీ సీనియర్ నేత ఫైర్‌

May 28 2025 10:07 PM | Updated on May 29 2025 3:37 PM

vadde sobhanadreeswara rao Takes on Chandrababu Naidu

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. చంద్రబాబు ఆలోచనల్లో కార్పోరేటర్లు, ధనవంతులు తప్ప సామాన్యులు కనిపించడం లేదని ధ్వజమెత్తారు. సామాన్యుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదన్నారు. ‘ఏపీ ప్రజలకు మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీరని ద్రోహం చేసింది. గతంలో సోమవారం పోలవరం అని వారం వారం చంద్రబాబు తిరిగారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం మంగళం పాడుతుంటే చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదు. పోలవరం ఎత్తు తగ్గించి , పునరావాసం ఎగ్గొడుతుంటే ఎందుకు చంద్రబాబు స్పందించడం లేదు. ప్రజల్ని ఎందుకు ఇంత మోసం చేస్తున్నారు చంద్రబాబు

పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నాడని మోదీ విమర్శించారు. పోలవరం పై చంద్రబాబు మహానాడులో తీర్మానం చేయాలి. బనకచర్ల - గోదావరి మీద ఉన్న శ్రద్ధ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పై లేదు. పోలవరమే ఇంతవరకూ పూర్తికాలేదు. 80 వేల కోట్లతో బనకచర్ల - గోదావరి ఎప్పటికి పూర్తిచేద్దామని అడుగుతున్నాను. కాంట్రాక్టర్లకు , రాజకీయ నాయకులకు  లాభం చేకూర్చేందుకు బనకచర్ల - గోదావరి టెండర్లకు తొందరపడుతున్నారు. కేంద్రం పై ఒత్తిడి తెచ్చి పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలి. జూన్ 2 నాటికి 2 లక్షల 20 వేల టిడ్కో ఇళ్లు పూర్తిచేసి ఇస్తామన్నారు.

ఎన్ని ఇళ్లు పూర్తిచేశారో మంత్రి నారాయణ సమాధానం చెప్పాలి. టిడ్కో ఇళ్లు పూర్తిచేయలేదు కానీ...భారీ అంతస్తులు భవనాలకు అనుమతిలిచ్చామని పేపర్లలో ప్రకటనలిస్తున్నారు. 22ఏ పేరుతో రైతులను ఇబ్బందికి గురిచేస్తున్నారు’ అని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement