సీఎంవో డైరెక్షన్‌.. ‘బీటెక్‌’ యాక్షన్‌! | TDP Btech Ravi Over Action Politics In Pulivendula Amid ZPTC ByElections, More Details Inside | Sakshi
Sakshi News home page

Pulivendula Violence: సీఎంవో డైరెక్షన్‌.. ‘బీటెక్‌’ యాక్షన్‌!

Aug 8 2025 7:06 AM | Updated on Aug 8 2025 10:27 AM

TDP btech Ravi Over Action Politics In Pulivendula

వైఎస్సార్‌ సీపీ నేతలను హతమార్చేందుకు ప్రణాళిక 

రవి తమ్ముడు భరత్, చిన్నాన్న రఘు రంగ ప్రవేశం 

ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌కు రక్షణ కరువు.. 

కుట్రలకు పక్కాగా సహకరిస్తున్న పోలీసు యంత్రాంగం

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ‘పులివెందుల గడ్డపై జెడ్పీ­టీసీ విజయం టీడీపీ సొంతం కావాలి...! ఏమి చేస్తారో... ఎలా చేస్తారో మీ ఇష్టం..! ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది.. మీకు నచ్చినట్లు యంత్రాంగాన్ని ఉపయోగించుకోండి...!’ ముఖ్యమంత్రి కార్యాలయం చేసిన ఈ డైరెక్షన్‌తో పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జి బీటెక్‌ రవి యాక్షన్‌­లోకి దిగిపోయారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలుపే లక్ష్యంగా అరాచకా­లకు తెగబ­డు­తున్నారు. అడ్డొచ్చిన వారిని అంతమొందించాలని పథక రచన చేస్తున్నారు.

అందులో భాగంగానే వైఎస్సార్‌సీపీ నేతలపై హత్యా­యత్నం ఘటనలు వరుసగా చోటు చేసు­కుంటున్నట్లు స్పష్ట­మ­వుతోంది. పచ్చ ముఠాలు పట్టపగలు మార­ణా­యుధా­లతో దాడికి తెగబడినప్పటికీ ఎమ్మెల్సీ రమేష్‌­యాదవ్‌కు గన్‌మేన్‌ సిద్ధయ్య కనీస ప్రొటెక్షన్‌ కల్పిం­చకపో­వడం గమనార్హం. గాల్లోకి కాల్పులు జరపలేదు. ఉన్నత స్థాయి ఆదేశాలతోనే గన్‌మెన్‌ మిన్నకుండిపోయినట్లు సమాచారం.

తొలుత సైదా­పురం సురేష్‌­కుమార్‌­రెడ్డి (చంటి), అమరేష్‌­రెడ్డిని టీడీపీ గూండాలు లక్ష్యంగా చేసుకోగా తర్వాత రోజు ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్,  వేల్పుల రామ­లింగారెడ్డిపై హత్యా­య­త్నం జరిగింది. ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌ వాహ­నాన్ని ధ్వంసం చేసి పెట్రోల్‌ పోసి తగలబెట్టే యత్నం చేశారు. ఇంత జరుగుతున్నా వాహనంలో ఉన్న ఎమ్మెల్సీ రమేష్‌­యాదవ్, వేల్పుల రామలింగారెడ్డి­లను కాపాడా­లనే ప్రయత్నం గన్‌మెన్‌ సిద్ధయ్య చేయ­కపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. 

హత్యోదంతంలో రవి కుటుంబ సభ్యులు..
ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్, వేల్పుల రామలింగారెడ్డి­లపై హత్యాయత్నం ఘటనలో స్వయంగా టీడీపీ ఇన్‌చార్జి బీటెక్‌ రవి కుటుంబ సభ్యులు పాల్గొ­న్నారు. ఆయన తమ్ముడు మారెడ్డి భరత్‌రెడ్డి, చిన్నాన్న రఘునాథరెడ్డి మారణాయుధాలు వెంట బెట్టుకొని నడిచి రాగా.. పేర్ల శేషారెడ్డి, మబ్బుచింతపల్లె శ్రీనాథరెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి, కిరికిరి బాషా అండ్‌ ఎల్లోగ్యాంగ్‌ వేల్పుల రామును హత్య చేసేందుకు యత్నించారు. అయితే నల్లగొండువారి­పల్లె గ్రామస్తులు తిరగబడడంతో అదృష్టవశాత్తు బతికి పోయారు. 

కొమ్ము కాస్తున్న యంత్రాంగం...
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార యంత్రాంగం పూర్తి ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. హత్యా యత్నానికి సంబంధించి రెండు ఘటన­ల్లోనూ తదుపరి ఎలాంటి చర్యలు లేవు. గురు­వారం కూడా టీడీపీ గ్యాంగ్‌ ఇనుప రాడ్లు వెంటబె­ట్టుకొని వాహనాల్లో యథేచ్ఛగా పులి­వెందులలో సంచరించింది. మరోవైపు బాధితు­లపైనే రివర్స్‌ కేసు నమోదు కావటాన్ని పరిశీలిస్తే పోలీస్‌ ఉన్న­తాధికారులు  ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్ట­మ­వుతోంది. వైఎస్సార్‌­ï­Üపీ కీలక నేతలు ఎక్కడె­క్కడ పర్య­టిస్తున్నారు? ఎవరెవరు ఉన్నారు? ఎంతమంది ఫాలో అవుతున్నారు.

టార్గెట్‌ చేసుకున్న వ్యక్తి అక్కడ ఉన్నాడా? లేడా? తదితర సమా­చారం అంతా స్థానిక పోలీసుల ద్వారా అధి­కార పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు చేరుతు­న్నట్లు సమాచారం. ఇక బ్యాలెట్‌ పేపర్‌ ముద్రిం­చడంలో కూడా మతలబు ఉన్నట్లు అనుమానాలు రేకెత్తుతు­న్నాయి. 11 మంది పోటీలో ఉన్న జెడ్పీటీసీ ఎన్నికల్లో బ్యాలెట్‌ను సింగిల్‌గా కాకుండా డబుల్‌ సైడ్‌ గుర్తులు ఇస్తూ ముద్రించేందుకు అధికారులు సిద్ధమై­నట్లు తెలుస్తోంది.

ఓటర్లను గందరగోళానికి గురి చేయాలనే ఈ ఎత్తుగడ వేసినట్లు స్పష్ట­మవు­తోంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్‌రెడ్డి గుర్తు 1వ గడిలో ఉంది. డబుల్‌ సైడ్‌ బ్యాలెట్‌ పేపర్‌ను మడత వేయడం వల్ల ఎక్కు­వగా వైఎస్సార్‌సీపీ ఓట్లు చెల్లకుండా పోవాలనే కుయుక్తి దాగి ఉన్నట్లు అనుమా­నాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement