Punjab: కాంగ్రెస్​ హైకమాండ్​పై చన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు

Punjab CM Channi Says No Problem If Congress Names Sidhu As CM Candidate - Sakshi

చండీగఢ్‌: పంజాబ్​లో రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీఎం చన్నీ, పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్​ సింగ్​లు తమ ఆధిపత్యం కోసం పోటాపోటీగా ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా, సీఎం చన్నీ ఒక మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో..  ‘త్వరలో జరగనున్న ఎన్నికలలో కాంగ్రెస్​ అధిష్టానం పంజాబ్​ సీఎం అభ్యర్థిగా.. రాష్ట్ర కాంగ్రెస్​ చీఫ్​ నవజ్యోత్​ సింగ్ సిద్ధూని పేరుని యోచిస్తుందా ’ అని ప్రశ్నించారు. దీనిపై చన్నీ తనదైన శైలీలో స్పందించారు. కాంగ్రెస్​ పార్టీకి తాను ఒక సేవకుడినని.. అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్న దాన్ని గౌరవిస్తానని స్పష్టం చేశారు.

సిద్ధూ తనకు సోదరుడు లాంటి వాడని, దీనిపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా చన్నీ..  మాజీ సీఎం అమరీందర్​ సింగ్​పై ఆరోపణలు గుప్పించారు. కాగా, ఇటీవల ఆమ్​ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్​ అరవింద్​ కేజ్రీవాల్​ పంజాబ్​ సీఎం​ అభ్యర్థిగా భగవంత్​మాన్​ పేరును ప్రకటించడంపై కూడా స్పందించారు. కేజ్రీవాల్​ పంజాబ్​ నుంచి నాయకుడిగా ఎదగాలన్నారు.

పంజాబ్​ ప్రజల నుంచి తగినంత మద్దతు కనబడకపోవడంతో చివరి నిమిషంలో భగవంత్​ మాన్​​ పేరును ప్రతిపాదించారని తెలిపారు. కాగా, చన్నీ తాను పోటికి దిగుతున్న చామ్​​కౌర్​ సాహిబ్​ స్థానం నుంచి ఓడిపోతారని కేజ్రీవాల్​ విమర్శించారు. అదే సమయంలో చన్నీ మేనల్లుడి ఇంట్లో కోట్లాది రూపాయలను ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు స్వాధీనం చేసుకోవడం కలకలంగా మారిన విషయం తెలిసిందే. పంజాబ్‌లో ఫిబ్రవరి 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.

చదవండి: ప్రధాని మోదీ అరుదైన రికార్డు.. బైడెన్‌ కంటే

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top