లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు  ఒక్క సీటూ రాదు | Minister Sridhar Babu Sensational Comments On BRS Party Over Lok Sabha Election 2024, Details Inside - Sakshi
Sakshi News home page

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు  ఒక్క సీటూ రాదు

Jan 5 2024 2:34 AM | Updated on Jan 5 2024 11:09 AM

Minister Sridhar Babu Sensational Comments on BRS Party  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ ఎస్‌ ఒక్క స్థానం కూడా గెలిచే అవకాశం లేదని పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు జోస్యం చెప్పారు. లోక్‌సభ ఎన్నికల తరువాత కారు పార్టీ కనుమరుగయ్యే అవ కాశం ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓడించినా బీఆర్‌ఎస్‌ నాయకుల్లో అహంకారం తగ్గ లేదన్నారు.  గురువారం గాంధీభవన్‌లో మంత్రి శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడారు.

2018 ఎన్ని కల్లో గెలిచిన తరువాత 36 రోజుల వరకు కనీసం అసెంబ్లీ సమావేశాలు కూడా ఏర్పాటు చేయని బీఆ ర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత ఉందా అని ప్రశ్నించారు.కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి నెలరోజులు కూడా కాకముందే రెండు హామీలను అమలు చేయడమే కాక, ప్రజల నుంచి అభయహ స్తం అమలు కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్న విష యం తెలియదా అని ఆయన ప్రశ్నించారు.

డిసెంబర్‌ 3న ఫలితాలు వచ్చిన నాలుగు రోజుల్లోనే మంత్రివర్గం ఏర్పడటం, మంత్రివర్గం ఏర్పాటైన రెండురోజుల్లోనే శాసన సభ సమావేశాలు ప్రారంభించడమేకాక, మహిళ లకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీ వ్యయ పరిమితిని పెంచిన విషయాన్ని శ్రీధర్‌ బాబు గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఆరున్నర కోట్ల మంది మహిళలు బస్సులో ఉచిత ప్రయాణం చేశారన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తరువా త రెండునెలల వరకు మంత్రివర్గం కూడా ఏర్పాటు చేయకపోవడం బాధ్యతారాహిత్యం కాదా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ విడుదల చేసిన బుక్‌లెట్‌పై మంత్రి మండిపడ్డారు. నెల కాకుండానే ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కడం దారుణమన్నారు. 

తొందరపాటు ఎందుకు.. ముందు పార్టీని చక్కదిద్దుకోండి
కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌కు ఎందుకంత తొందరపాటు అని మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలను ఒకటి తర్వాత ఒకటి పూర్తి చేస్తున్నామన్నారు. మీరేమై నా సూచనలు చేస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మీ పార్టీ కార్యా లయంలో మీడియా సమావేశాలు పెట్టడం కాదు క్షేత్రస్థాయికి వెళ్లి చూడండని హితవు పలికారు.. విభజన హామీలపై ఏమాత్రం పోరాటం చేయని బీఆర్‌ఎస్‌ 420నో కాదో ప్రజలకు తెలుసు నని అన్నారు. అధికారం పోయిందనే అక్క సుతో ఆరోపణలు చేయడం సరికాదని, ముందు పార్టీని చక్కదిద్దుకో వాలని సూచించారు. కొంతమంది ఆటో డ్రైవర్‌లను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకొనే ప్రయత్నం చేస్తున్నారని శ్రీధర్‌బాబు విమర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement