
పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరాడని.. సినిమా డైలాగులు చెప్పడానికే పనికొస్తాడంటూ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.
సాక్షి, ప్రకాశం జిల్లా: పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరాడని.. సినిమా డైలాగులు చెప్పడానికే పనికొస్తాడంటూ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. నాలుగో సిద్దం సభతో టీడీపీ మూత పడటం ఖాయం అని, టీడీపీ నుంచి పోటీచేసే నాయకులే ఆలోచనలో పడతారన్నారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుకు కాపులు మద్దతు ఇవ్వరని తేల్చి చెప్పారు. ‘‘తాడేపల్లి గూడెం సభతో టీడీపీ బలం ఏంటో తెలిసింది. అందుకే కాపులు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. మా టార్గెట్ 175కి 175’’ అని మంత్రి పేర్కొన్నారు.