వరద బాధితులను ఇలా పరామర్శిస్తారా?  | Lella Appireddy Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

వరద బాధితులను ఇలా పరామర్శిస్తారా? 

Jul 22 2022 5:00 AM | Updated on Jul 22 2022 8:29 AM

Lella Appireddy Fires On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన రోడ్‌ షోలో అసలు వరద గురించిన ప్రస్తావనే లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ముంపు గ్రామాలకు వెళ్లిన చంద్రబాబు వరద బాధితుల గురించి కాకుండా.. శ్రీలంక గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. దారి పొడవునా ఆయన డప్పు తప్ప ఏం లేదన్నారు. ఈ విధంగా ఎవరైనా వరద బాధితులను పరామర్శిస్తారా అని అప్పిరెడ్డి ప్రశ్నించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement