కేటీఆర్‌కు అస్వస్థత.. ‘కదన భేరి’కి దూరం | KTR Sicked Likely To Skip KCR Karimnagar Meeting | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌కు అస్వస్థత.. కరీంనగర్‌ ‘కదన భేరి’కి దూరం

Mar 12 2024 1:36 PM | Updated on Mar 12 2024 3:40 PM

KTR Sicked Likely To Skip KCR Karimnagar Meeting  - Sakshi

బీఆర్‌ఎస్‌ సెంటిమెంట్‌గా భావించే కరీంనగర్‌ సభకు కేటీఆర్‌ దూరంగా ఉండనున్నారు.. 

హైదరాబాద్‌, సాక్షి: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు అస్వస్థతకు గురయ్యారు. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు పార్టీ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. దీంతో ఆయన బీఆర్‌ఎస్‌ కరీంనగర్‌ సభకు దూరంగా ఉంటారని తెలిపింది.

ఇవాళ కరీంనగర్‌లో కదన భేరి పేరుతో బీఆర్‌ఎస్‌ సభ నిర్వహించనుంది. ఈ సభ నుంచి లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పార్టీ అధినేత కేసీఆర్ పూరించనున్నారు. అదే సమయంలో బీఆర్‌ఎస్‌కు కరీంనగర్‌ సెంటిమెంట్‌ ఎక్కువ. దీంతో ఈ సభను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అలాంటి సభకు అనారోగ్యంతో కేటీఆర్‌ హాజరు కాలేకపోతుండడం విశేషం.

మూడు రోజుల కింద కామారెడ్డిలో జరిగిన సమావేశం తర్వాత  కేటీఆర్ అస్వస్థతకు గురయ్యారు. ఇదిలా ఉంటే.. గత రెండు రోజులుగా ఇంటి వద్దనే డాక్టర్ పర్యవేక్షణలో ఆయన చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా కోలుకుంటారని.. తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని బీఆర్‌ఎస్‌ శ్రేణులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement