కేటీఆర్‌ది రెచ్చగొట్టే కుట్ర | cm revanth reddy comments on ktr | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ది రెచ్చగొట్టే కుట్ర

Aug 1 2024 6:01 AM | Updated on Aug 1 2024 9:08 AM

cm revanth reddy comments on ktr

సూచనల ముసుగులో మోసం చేస్తున్నారు: అసెంబ్లీలో సీఎం రేవంత్‌ 

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి కేటీఆర్‌ సూచనల ముసుగులో శాసనసభను తప్పుదోవ పట్టించేందుకు, మోసమనే ప్రణాళికను ప్రజల మెదళ్లలో చొప్పించేందుకు ప్రయతి్నస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పదేళ్లు ఏలినవారు పది నెలలు కూడా పూర్తి చేసుకోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద వందల ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఎప్పుడు చూసినా రాజకీయాలేనా? ప్రభుత్వంగా మా పాత్ర మేం పోషిస్తాం. ప్రతిపక్షంగా వారి పాత్ర వారు పోషించాలి. ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు. ఎందుకు రాజకీయాలు?’’అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. బుధవారం ఉదయం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడిన కేటీఆర్‌.. కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. ఈ సమయంలో మధ్య మధ్యలో సీఎం రేవంత్‌ జోక్యం చేసుకున్నారు.

ముచ్చర్ల భూములను ఫార్మాసిటీ కోసం తీసుకుంటున్నట్టు నోటిఫికేషన్‌ ఇచ్చారని, ఇప్పుడా భూముల వినియోగం మారిస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని కేటీఆర్‌ సూచించడంపై విరుచుకుపడ్డారు. ఆ వివరాలు రేవంత్‌ మాటల్లోనే.. ‘‘ముచ్చర్ల వద్ద భూసేకరణకు సంబంధించి సొంతంగా ఎందుకు ఊహాగానాలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు? హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌ తర్వాత ముచ్చర్ల నాలుగో సిటీగా.. మన భవిష్యత్తు సిటీగా అవతరించబోతోంది. అంతర్జాతీయ స్థాయి వైద్యం కావాలంటే అక్కడికి రావాలి. స్కిల్‌ నేర్చుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా యువత అక్కడికి రావాలి. అంతర్జాతీయ క్రీడాకారులు అక్కడికి రావాలి. అలా అన్ని రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్‌గా మార్చబోతున్నాం. 

స్పోర్ట్స్‌ వర్సిటీ ఏర్పాటు చేస్తాం..: ముచ్చర్లలో యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. గురువారం సాయంత్రం జరిగే శంకుస్థాపనకు ప్రతిపక్ష నేతలు కూడా రావాలి. మాదాపూర్‌లోని న్యాక్‌ను అక్కడికి మార్చి పెద్ద వ్యవస్థగా ఏర్పాటు చేస్తున్నాం. ఒకప్పుడు ఆఫ్రో ఏషియన్‌ గేమ్స్‌ను ఘనంగా నిర్వహించుకున్న ఘనత హైదరాబాద్‌ది. దానికి ఉపయోగించిన గచి్చ»ౌలి స్టేడియం సముదాయాన్ని నిరుపయోగంగా, తాగుబోతులకు అడ్డాగా చేశారు. ఇప్పుడు ముచ్చర్లలో ఓ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, అంతర్జాతీయ స్టేడియం నిర్మించబోతున్నాం. అంతర్జాతీయ స్థాయి శిక్షణ కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం నిర్మాణం కోసం బీసీసీఐతో మాట్లాడాం దీంతోపాటు 200 ఎకరాల్లో ఆర్టిఫిíÙయల్‌ ఇంటెలిజెన్స్‌ హబ్‌ను అంతర్జాతీయ సంస్థలతో ఏర్పాటు చేయబోతున్నాం. 

ఆ ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు..: క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న హైదరాబాద్‌ క్రికెటర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు విద్యార్హతల్లో మినహాయింపులు ఇచ్చి గ్రూప్‌–1 స్థాయి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించాం. ఒలింపిక్స్‌లో పతకం తెచి్చన బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు గత ప్రభుత్వం ఉద్యోగం ఇస్తానని ఇవ్వలేదు. ఇప్పుడు ఆమెకు కూడా గ్రూప్‌–1లో డీఎస్పీ స్థాయి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించాం.

బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ వేసుకొచ్చా.. 
‘‘కేసీఆర్‌ సభకు వస్తారేమోనని ఎదురుచూశా రాలేదు. ఆయన ఇటీవల చీల్చి చెండాడుతానని ప్రకటించడంతో.. ఎందుకైనా మంచిదని బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ వేసుకుని వచ్చా’’అని రేవంత్‌ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇక ‘‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌కు కేటీఆర్‌కు సంబంధం ఏమిటన్న విషయంలో నేను, మంత్రులు మాట్లాడుకుంటుండగా చర్చకు వచి్చంది. కేటీఆర్‌ 100 శాతం ఆరి్టఫిíÙయల్, జీరో శాతం ఇంటెలిజెన్స్‌æ అని ఒకరు తేల్చారు’’అని ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement