గోదావరిఖని: ప్రమాదం జరిగాక బాధపడేకన్నా ముందుజాగ్రత్తలు పాటిస్తే సురక్షితంగా గమ్యస్థా నం చేరుకోవచ్చు. బయటకు వెళ్లేముందు వాహనం తాళంచెవి తీసుకున్నట్లే, హెల్మెట్, కారులో కూర్చున్నాక సీట్బెల్ట్ ధరించడం తప్పనిసరి.
పోలీసుల సీరియర్
రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. హెల్మెట్లేక ద్విచక్రవాహనదారులు, సీట్బెల్ట్ ధరించక కార్లు, ఇతర భారీవాహనదారులు మృతి చెందుతున్నారు. ఇలాంటి ప్రమాదాల నియంత్రణపై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. నిబంధనలు అతిక్రమిస్తున్న వారికి పెద్దమొత్తంలో జరిమానా విధిస్తోంది.
ఒక్క క్షణం నిర్లక్ష్యం.. జీవితాంతం విషాదం
ఒక ప్రమాదంలో ఒకరేకాదు.. ఒకకుటుంబం మొత్తం నష్టపోతుంది. పిల్లలు తండ్రిని కోల్పోవచ్చు, తల్లిదండ్రులు బిడ్డను కోల్పోవచ్చు, భార్య జీవిత భాగస్వామిని కోల్పోవచ్చు. హెల్మెట్, సీట్బెల్ట్ ధరిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.
ఇవి పాటించండి


