పెద్దపల్లి: విద్యారంగ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలసాని లెనిన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ ఎదుట విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. విద్యార్థుల స్కాలర్షిప్, ఫీజురీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఎంఈవో, డీఈఓ పోస్టులను భర్తీ చేయాలని అన్నారు. ఎఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు అర్నకొండ సాయి ఆజాద్, కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం, సహాయ కార్యదర్శి లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు.


