మేడే ఉత్సవాలకు సన్నాహాలు పూర్తి | - | Sakshi
Sakshi News home page

మేడే ఉత్సవాలకు సన్నాహాలు పూర్తి

Apr 29 2026 7:48 AM | Updated on Apr 29 2026 7:48 AM

వాల్‌పోస్టర్లు, కరప్రతాల ఆవిష్కరణ

విజయనగరం గంటస్తంభం: ప్రపంచ కార్మిక హక్కుల దినోత్సవమైన మేడే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏఐసీసీటీయూ ఆధ్వర్యంలో సన్నాహాలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా మేడే ఉత్సవాలకు సంబంధించిన వాల్‌పోస్టర్లు, కరపత్రాలను మంగళవారం కొత్తదేవరవీధిలో గల కార్యాలయంలో ఆవిష్కరించారు. మే1వ తేదీ ఉదయం 10 గంటలకు కుప్పిలి వీధిలోని పైడిరాజమ్మ సామాజిక భవనంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీటీయూ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు కామ్రేడ్‌ బొడ్డు వాసుదేవరావు ముఖ్య అతిఽథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐసీసీటీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.రాజు పిలుపునిచ్చారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం మేడే పోరాటస్ఫూర్తిని కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో గిరిప్రసాద్‌, సన్యాసిరాజు, అప్పారావు, సత్యారావు, గోవింద్‌, అచ్చన్న, పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement