గజపతినగరం: మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న కారు, బొలెరో వాహనాలు అదుపుతప్పి సోమవారం ఢీకొన్నాయి. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. బొబ్బిలి నుంచి విజయనగరం వైపు వెళ్తున్న కారు ఎరువుల లోడుతో ఎదురుగా వస్తున్న బొలెరో వ్యాన్ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఎం.సూర్యనారా యణ రాజు(44),కె.ప్రకాష్ రావు(48)లకు స్పల్పగాయాలయ్యాయి. వారిని స్థానికులు గజపతినగరం ప్రభుత్వ కేంద్రాస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. ఈ ఘటనలో వాహనాలకు డ్యామేజ్ తప్ప ప్రాణాపాయం లేదని స్థానికులు తెలిపారు.


