న్యూస్రీల్
భర్త గంగులు ఏడాదిన్నర కింద ట అనారోగ్యంతో మృతి చెందారు. పలువురు ఇళ్ల వద్ద పనిచేసి ఇద్దరు పిల్లలతో కుటుంబా న్ని నెట్టుకొస్తున్నాను. సచివాల యానికి కాళ్లరిగేలా తిరుగుతున్నా పింఛన్కు దరఖా స్తు తీసుకోవడం లేదు. కుటుంబ పోషణ కష్టమవు తోంది. దీన స్థితిలో ఉన్నా ప్రభుత్వానికి కనికరం లేదు. – కోరాడ బుజ్జి, గొల్లవీధి, వీరఘట్టం
రెండేళ్ల కిందట భర్త చనిపోయా డు. కూటమి ప్రభుత్వం వస్తే తనలాంటి వితంతువులకు వెంటనే పింఛన్ ఇస్తామన్నారు. రెండేళ్లుగా సచివాలయానికి తిరుగుతున్నా కొత్త పింఛన్ల మంజూరు ఉత్తర్వులు రాలేదని సిబ్బంది చెబుతున్నారు. బట్టలు ఉతుకు తూ జీవనం సాగిస్తున్న తనలాంటి వారికి పింఛన్ మంజూరుకాకపోవడంతో జీవనానికి ఇబ్బందులు పడుతున్నాం. – వెంపడాపు లక్ష్మి, వీరఘట్టం


