విద్యుత్‌ షాక్‌తో హోటల్‌ యజమాని మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో హోటల్‌ యజమాని మృతి

Apr 22 2026 7:18 AM | Updated on Apr 22 2026 7:18 AM

పూసపాటిరేగ: మండలంలోని కందివలస సమీపంలో దేవి హోటల్‌ నిర్వహిస్తున్న చిక్కాల అనిల్‌కుమార్‌(29) విద్యుత్‌షాక్‌తో దుర్మరణం చెందాడు. హోటల్‌ వెనకభాగంలో నీటిపైపుతో ఇంటిని శుభ్రం చేస్తుండగా షాక్‌ తగిలి అపస్మారక స్థితిలో చేరుకున్నాడు. ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. ఆయనకు భార్య అనురాధ ఉన్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పూసపాటిరేగ ఎస్‌ఐ ఐ.దుర్గాప్రసాద్‌ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement