విజయనగరం గంటస్తంభం: అంతర్రాష్ట్ర వలస కార్మికులు తమ సమస్యలను నేరుగా అధికారులకు ఫిర్యాదు చేసేందుకు విజయవాడలో 24 గంటల పాటు పనిచేసే టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేసినట్లు విజయనగరం కార్మికశాఖ ఉప కమిషనర్ ఎస్డీవీ ప్రసాదరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వలస కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం 1800–425–8587 నంబర్కు ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. కార్మికులు ఎదుర్కొనే ఇబ్బందులను తక్షణమే పరిష్కరించే ఉద్దేశంతో కార్మికశాఖ ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిందని వివరించారు.


