వైఎస్సార్సీపీలో కొత్త నియామకాలు
సాక్షి, పార్వతీపురం మన్యం: వైఎస్సార్సీపీ రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగ కమిటీల్లో పలువురు నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో నియామకం చేపట్టినట్లు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎస్టీ సెల్ జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్గా సాలూరుకు చెందిన కొండగొర్రి ఉదయ్కుమార్ నియమితులయ్యారు.
రాష్ట్రస్థాయి విభాగాల్లో..
రాష్ట్ర స్థాయిలో వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శిగా పట్నాన శ్రీనివాసరావు(పార్వతీపురం), వాణిజ్య విభాగం కార్యదర్శి ఉప్పల నాగేశ్వరరా వు, బూత్ కమిటీ విభాగ ప్రధాన కార్యదర్శి కని మెరక త్రినాథరావు, సాంస్కృతిక విభాగ ప్రధాన కార్యదర్శి మేడిశెట్టి అప్పలనాయుడు, ఎస్సీ సెల్ కార్యదర్శి డోల బాబ్జీ, బీసీ సెల్ సంయుక్త కార్యదర్శి గొర్లె మాధవరావు, క్రిస్టియన్ మైనారిటీ సెల్ సంయుక్త కార్యదర్శిగా బచ్చల ప్రసాదరావు (సాలూరు)లను నియమించారు.
జిల్లా యువజన కమిటీ..
యువజన విభాగ జిల్లా ఉపాధ్యక్షుడిగా గాడు శంకరరావు, ప్రధాన కార్యదర్శిగా కోట సంజీవనా యుడు, కార్యదర్శులుగా శనపతి చంద్రరావు, గుల్లిపల్లి మురళీకృష్ణ, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఎల్.సురేష్కుమార్, మజ్జి శ్రావణ్కుమార్, పైడాన శ్రీనివాసరావు నియామకమయ్యారు.
జిల్లా మహిళా విభాగం కమిటీ..
మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా చింతా డ శైలజ, ప్రధాన కార్యదర్శి పెండ స్రవంతి, కార్యదర్శులుగా పేకాల రాధ, గొల్లు పద్మజ, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా కొట్టాన లలిత, సాలూమూ రు తవిటిరాజు, గొడవ పార్వతి.
జిల్లా బీసీ సెల్ కమిటీ..
బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మడక ప్రభాకర్నాయుడు, కార్యదర్శులుగా కోడె వెంకటనాయుడు, అర్నిపల్లి శివునాయుడు, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా సువ్వాడ తవిటినాయుడు, కోట సూ ర్యనారాయణ, రొంపిల్లి సింహాచలం నాయుడు.
జిల్లా ఎస్సీ సెల్..
ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా హరియాల ఆనందరావు, కార్యదర్శులుగా బొద్దూరు గంగరాజు, దేవాబత్తుల సుందరరావు, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా గంటా కృష్ణ, జొన్నాడ శ్రీకాంత్, గర్భాపు మోహనరావు, జమ్మి శివుడయ్య.
జిల్లా మైనారిటీ సెల్..
మైనారిటీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా షేక్ పీరు, కార్యదర్శులు షేక్ బాబ్జీ, షేక్ సలీం, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా షేక్ బాషా, షేక్ మదీనా, షేక్ మొహిద్దిన్, షేక్ ముంతాజ్.
జిల్లా క్రిస్టియన్ మైనారిటీ విభాగం
క్రిస్టియన్ మైనారిటీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అలజంగి ప్రతాప్, కార్యదర్శులు శీలం మనోహర్ పాల్, అరసాడ వెంకటరావు, ఎగ్జిక్యూ టివ్ సభ్యులుగా వడ్డి మాధవ, అలజంగి శామ్యూల్ రాజశేఖర్, మజ్జి జయరాజ్, గొట్టాపు నవీన్కుమార్ నియమితులయ్యారు.
పార్వతీపురం, సీతానగరం మండలాల్లో నియామకాలు
పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించి పార్వతీపురం, సీతానగరం మండలాల యువజన, మహిళా, రైతు విభాగం, బీసీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, మైనారిటీ సెల్, క్రిస్టియన్ మైనారిటీ సెల్, విద్యార్థి విభాగం, పంచాయతీరాజ్ విభాగం, వాలంటీర్స్ విభాగం, సాంస్కృతిక, వాణిజ్య విభాగం, బూత్ కమిటీ, సోషల్ మీడియా, పబ్లిసిటీ విభాగాల్లో నూతన కమిటీలను నియమించారు. నియోజకవర్గంలో వివిధ అనుబంధ విభాగాలకు నూతనంగా నియమితులైన నాయకులకు మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అభినందనలు తెలియజేశారు. అధినేత ఆదేశాల మేరకు పార్టీ బలోపేతంపై క్షేత్రస్థాయిలో కష్టపడి పని చేయాలని.. జగన్మోహన్రెడ్డిని మరలా ముఖ్యమంత్రిని చేసేలా కలిసికట్టుగా శ్రమించాలని ఆయన పిలుపునిచ్చారు.


