22న పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపికలు
విజయనగరం: రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో జరుగనున్న పారా బ్యాడ్మింటన్ క్రీడా పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు ఈ నెల 22న నిర్వహింంచనున్నట్టు పారా జిల్లా అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ తెలిపారు. ఈ మేరకు జిల్లా స్థాయి పోటీల నిర్వహణకు సంబంధించిన కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ఓపెన్ కేటగిరిలో నిర్వహించే ఎంపికల్లో ఆసక్తి గల దివ్యాంగ క్రీడాకారులు ముందుగా పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. క్రీడాకారులకు ఆ రోజు రాజీవ్ ఇండోర్ స్టేడియంలో 8 గంటల నుంచి ఎంపికలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. ఇతర వివరాలకు 9849377577 నంబరును సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో కె.ప్రసాద్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.


