హాకీ జిల్లా జట్ల ఎంపిక వాయిదా | - | Sakshi
Sakshi News home page

హాకీ జిల్లా జట్ల ఎంపిక వాయిదా

Nov 2 2025 9:10 AM | Updated on Nov 2 2025 9:10 AM

హాకీ

హాకీ జిల్లా జట్ల ఎంపిక వాయిదా

నష్టపోయిన రైతులందరినీ ఆదుకోవాలి తాడేపల్లి రూరల్‌: మోంథా తుఫాన్‌ కారణంగా రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని, రైతాంగాన్ని కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. శనివారం తాడేపల్లి రూరల్‌ పరిధిలోని కుంచనపల్లి, ప్రాతూరు గ్రామాల్లో తుఫాన్‌ ప్రభావంతో దెబ్బతిన్న పంటపొలాలను నాయకులతో కలసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తుఫాన్‌ ప్రభావంతో గుంటూరు, కృష్ణ, ఎన్టీఆర్‌, బాపట్ల, ఉభయ గోదావరి జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వరి, పండ్ల తోటలు, ఉల్లి, టమాటా, కంద, ఆకుకూరలు, అరటి రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం తక్షణం సహాయం అందించాలన్నారు. నష్టపోయిన మెట్ట ప్రాంత రైతులకు ఎకరాకు రూ.30 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. త్వరలో రెవెన్యూ మంత్రిని కలసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన పంట వివరాలు వారి దృష్టికి తీసుకువస్తామని పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్రకార్యవర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌, జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, సహాయ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, ఏపీ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు కొల్లి రంగారెడ్డి, రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షులు ముసునూరు సుహాన్‌, కార్యదర్శి యార్లగడ్డ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సత్తెనపల్లి: సత్తెనపల్లి మండలం నందిగామ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఈనెల 3న విద్యా కేంద్రం జూనియర్‌ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన అండర్‌–19 హాకీ జిల్లా జట్ల ఎంపికలు క్రీడా మైదానం అనుకూలత లేనందున వాయిదా వేసినట్లు అండర్‌–19 ఉమ్మడి గుంటూరు జిల్లా స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి జి నరసింహారావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జట్ల ఎంపిక ఈనెల 10న నిర్వహించనున్నట్లు తెలిపారు. క్రీడాకారులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.

పెద్దింటమ్మతల్లి ఆలయంలో చోరీ

అమరావతి: అమరావతి గ్రామదేవత పెద్దింటమ్మ తల్లి దేవాలయంలో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం... శుక్రవారం రాత్రి దేవాలయంలో పపూజల అనంతరం పూజారులు తాళాలు వేసి వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని అగంతకులు అమ్మవారి ఆలయం గేటుకు వేసి ఉన్న ఐదు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. హుండీకి ఉన్న రెండు తాళాలను పగులగొట్టి అందులోని సుమారు రూ.8వేల నగదును దొంగిలించారు. శనివారం ఉదయం ఆలయం తెరవటానికి వచ్చిన పూజారులు తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ అచ్చయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్‌ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. సంఘటనపై కేసు నమోదు చేసి ప్రత్యేక టీంతో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ

హాకీ జిల్లా జట్ల ఎంపిక వాయిదా 1
1/1

హాకీ జిల్లా జట్ల ఎంపిక వాయిదా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement