
భారీగా ఆవుల అక్రమ రవాణా
కొరాపుట్: ఆవుల అక్రమ రవాణాని ప్రజలు అడ్డుకున్నారు. మంగళవారం సాయంత్రం జయపూర్ పట్టణం లో జయనగర్ మీదుగా వరుసగా వాహనాలతో ఆవులు తరలించడాన్ని స్థానికులు గమనించారు. ఒక్కసారిగా రోడ్డు మీదకు వచ్చి వాహనాలు అడ్డగించారు. అప్పటికే రెండు వ్యాన్లు ప్రజలను చూసి వేగంగా వెళ్లిపోయాయి. వెనుక ఉన్న 9 వ్యాన్లను ప్రజలు అదుపులోకి తీసుకున్నారు. వాటిని నడుపుతున్న డ్రైవర్లపై దాడికి దిగారు. ఇది తెలిసి హిందూ సంఘాల ప్రతినిధులు ఆందోళకు దిగారు. పోలీసు బలగాలు చేరుకుని ప్రజల నుంచి వాహన డ్రైవర్లను రక్షించారు. ఈ వాహనాలు కొరాపుట్ జిల్లాలోని జయంత్ గిరి నుంచి ఆంధ్రా బోర్డర్ లోని పాడువకి తరలిస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది.

భారీగా ఆవుల అక్రమ రవాణా