
పార్టీ బలోపేతమే లక్ష్యం
కొరాపుట్: జయపూర్ పట్టణంలో ఆదివారం బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చో హాజరై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. పార్టీ పటిష్టతకు సమష్టిగా కృషి చేయాలన్నారు.
మద్యం విక్రయాలపై వివాదం
కొరాపుట్: లక్ష్మీపూర్ సమితి కేంద్రంలో మద్యం విక్రయాలపై వివాదం చెలరేగింది. ఆదివారం బీజేపీ కార్యదర్శి, లక్ష్మీపూర్ నియోజకవర్గ సమన్వయకర్త అగస్తి హల్వ నేతృత్వంలో నిరసన చేపట్టారు. లక్ష్మీపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో మద్యం విక్రయశాల నిర్వహిస్తుండటంపై మీడియాతో మాట్లాడారు. ఎంఆర్పీ కంటే ఎక్కవ ధరకు మద్యం అమ్ముతున్నారని, ఇదేంటని ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారని, ఇక్కడ ఎక్కువగా విదేశీ నకిలీ మద్యం అమ్ముతున్నారని ఆరోపించారు. దీనిని తాగడం వల్ల చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు స్థానికులు కూడా ఈ మద్యం షాపు అక్రమాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విషం తాగి యువకుడి మృతి
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా పోడియా సమితి నీలిగూఢ పంచాయతీ దుర్మాగూఢ గ్రామంలో శనివారం రాత్రి ముయ పోడియామి (22) అనే వ్యక్తి విషం తాగి మృతి చెందాడు. ముయ పోడియామి శనివారం ఉదయం నుంచి కేందుకులుకు సమీపంలోని అడవికి వెళ్లాడు. సాయంత్రానికి ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో గూటిలో ఉన్న పురుగు మందు తాగి పడిపోయాడు. అది చూసిన కుటుంబ సభ్యులు వెంటనే పోడియాను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మల్కన్గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోడియా పోలీసులు కేసు నమోదు చేశారు.
లెట్రిన్ ట్యాంక్లో ఆవు
కొరాపుట్: జయపూర్ పట్టణంలో ఇరిగేషన్ కాలనీలో లెట్రిన్ ట్యాంకులో ఆవు పడటంతో నరకయాతన అనుభవించింది. పాడుబడ్డ ట్యాంక్ పైకప్పు ఊడిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఆవును సురక్షితంగా బయటకు తీసారు. అనంతరం పశువుల ఆసుపత్రికి వైద్యం కోసం తరలించారు.

పార్టీ బలోపేతమే లక్ష్యం

పార్టీ బలోపేతమే లక్ష్యం

పార్టీ బలోపేతమే లక్ష్యం