తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

Nov 16 2023 1:28 AM | Updated on Nov 16 2023 9:41 AM

- - Sakshi

తొమ్మి దో తరగతి చదువుతున్న పూజ కుంజ (15) హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

మల్కన్‌గిరి: కలిమెల సమితి మోటు పోలీసుస్టేషన్‌ పరిధి లో గల మోటు గ్రామంలోని ఆశ్రమ పాఠశాలలో తొమ్మి దో తరగతి చదువుతున్న పూజ కుంజ (15) హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇక్కడి మధు సూదన్‌ ఆశ్రమ పాఠశాలలో వంద పడకలు ఉన్నాయి. బుధవారం బిర్సాముండా జయంతిని పాఠశాలలో నిర్వహించగా హాస్టల్‌ పిల్లలంతా వెళ్లారు.

ఇంతలో ఏం జరిగిందో గానీ తిరిగి వచ్చి చూసే సరికి పూజ కుంజ ఓ తరగతి గదిలో ఉరికి వేలాడుతూ కనిపించాడు. పిల్లలంతా భయంతో కేకలు వేయడంతో హాస్టల్‌ సిబ్బంది, ఉపాధ్యాయులు వచ్చి చూశారు. అప్పటికే విద్యార్థిని మృతి చెందింది. దీనిపై వారు విద్యార్థిని తల్లిదండ్రులతో పాటు పోలీసులకు సమాచారం అందజేశారు. పూజ స్వగ్రామం గినిపల్లి. దీనిపై మోటు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమ బిడ్డ ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడిందో తెలీదని విద్యార్థిని తండ్రి దుల కన్నీరుమున్నీరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement