నిత్యాన్నదానానికి విరాళం | - | Sakshi
Sakshi News home page

నిత్యాన్నదానానికి విరాళం

Mar 23 2026 9:15 AM | Updated on Mar 23 2026 9:15 AM

నిత్యాన్నదానానికి విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి కృష్ణా జిల్లాకు చెందిన భక్తులు ఆదివారం రూ. లక్ష విరాళాన్ని అందజే శారు. పెనమలూరు మండలం వణుకూరుకు చెందిన వనుకూరి వంశీకృష్ణ కుటుంబం అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చే సింది. ఆలయ అధికారులను కలిసిన వంశీకృష్ణ తన తండ్రి శివరామ ప్రసాదరావు పేరిట నిత్యాన్నదానానికి రూ. 1.25 లక్షల విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వరుస సెలవుల నేపథ్యంలో ఆదివారం ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్లను పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి భక్తులు తరలివచ్చారు. రెండు రోజులుగా శుభ ముహూర్తాల వేళ ఒక్కటైన నూతన వధూవరులు పెళ్లి బట్టలపై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం 10 గంటల తర్వాత భక్తుల రద్దీ అధికం కావడంతో ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. మధ్యాహ్నం మహానివేదనకు అరగంట అన్ని దర్శనాలు నిలిపివేయడంతో రద్దీ మరింత అధికమైంది. దీంతో అంతరాలయ దర్శనం నిలిపివేశారు. రూ. 300 టికెట్లపై బంగారు వాకిలి దర్శనం కల్పించారు. సాయంత్రం పంచహారతుల సేవ, పల్లకీ సేవ, దర్బారు సేవ నిర్వహించారు. రేపు మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ జిల్లా స్థాయి పోటీలు శోభాయమానం.. పుష్పార్చన

మచిలీపట్నంఅర్బన్‌: డిస్ట్రిక్ట్‌ స్పోర్ట్స్‌ అథారిటీ నిర్వహిస్తున్న శాప్‌ లీగ్స్‌లో భాగంగా జిల్లా స్థాయి మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ పోటీలు ఈ నెల 24వ తేదీ మచిలీపట్నంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార అధికారి కె. ఝాన్సీలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో 35+, 45+ వయో విభాగాల్లో పురుషులు, మహిళలు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు మార్చి 30, 31 తేదీల్లో గుంటూరులోని ఏఎన్‌యూలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం పొందుతారని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో 100, 400, 800, 1500 మీటర్ల పరుగులు, 4 100 రిలే, లాంగ్‌ జంప్‌, హై జంప్‌, షాట్‌పుట్‌, డిస్కస్‌, జావెలిన్‌ త్రో వంటి క్రీడాంశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పాల్గొనదలచిన క్రీడాకారులు శాప్‌ అధికారిక వెబ్‌సైట్‌ htt pr://SportS.ap.gov.in/#/home/SaapLeaGue లో నమోదు చేసుకోవాలని సూచించారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రోత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో నాల్గో రోజైన ఆదివారం జగన్మాతకు మందార పుష్పాలు, ఎర్రకలువలు, చామంతులతో అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారి అర్చన నిమిత్తం సేకరించిన పుష్పాలతో ఆలయ ఈవో శీనానాయక్‌, స్థానాచార్య శివప్రసాద్‌శర్మ, ఆలయ అర్చకులు, సిబ్బంది ప్రధాన ఆలయంలో మూలవిరాట్‌ను దర్శించుకున్నారు. అనంతరం నూతన పూజా మండపంలోని ఉత్సవ మూర్తి వద్ద ఆలయ అర్చకులకు ఆయా పుష్పాలను అందించారు. వేద మంత్రోచ్ఛారణ మధ్య ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష పుష్పార్చన నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పంచహారతుల సేవ జరిగింది. పుష్పార్చనలో అమ్మవారికి సమర్పించిన పుష్పాలను అర్చకులు భక్తులకు పంపిణీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement