వేలిముద్రల దొంగలున్నారు జాగ్రత్త! | - | Sakshi
Sakshi News home page

వేలిముద్రల దొంగలున్నారు జాగ్రత్త!

Jun 15 2025 7:14 AM | Updated on Jun 15 2025 7:14 AM

వేలిమ

వేలిముద్రల దొంగలున్నారు జాగ్రత్త!

విజయవాడ స్పోర్ట్స్‌: ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సిస్టమ్‌ (ఏఈపీఎస్‌) సైబర్‌ నేరాలు విజయవాడలో పునరావృతం అయ్యాయి. విజయవాడ సైబర్‌ పోలీసులు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 2023లో ఈ నేరాలకు అడ్డుకట్ట వేయగలిగారు. అయితే తాజాగా గత నెలలో మళ్లీ నగర సైబర్‌ స్టేషన్‌కు ఏఈపీఎస్‌ బాధితులు క్యూ కట్టడం కలవరపెడుతోంది. నగరంలోని మాచవరం, సత్యనారాయణపురం, కృష్ణలంక, భవానీపురం ప్రాంతాలకు చెందిన ఐదుగురు వ్యక్తుల బ్యాంకు ఖాతాలను నేరగాళ్లు ఖాళీ చేశారు. బిహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల నుంచి నేరగాళ్లు ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

పలు మార్గాల్లో వేలిముద్రలు చోరీ..

సాధారణంగా బ్యాంకు ఖాతా నుంచి నగదు లావాదేవీ జరిగేటప్పుడు ఖాతాదారుడి మొబైల్‌కు మెసేజ్‌ (ఓటీపీ) వస్తుంది. సైబర్‌ నేరగాళ్లు బ్యాంకు ఖాతాల్లోని నగదు దోచుకునేటప్పుడు సైతం మెసేజ్‌ (ఓటీపీ) వస్తుంది. అయితే ఏఈపీఎస్‌ తరహా నేరాల్లో ఎలాంటి ఓటీపీ బ్యాంకు నుంచి రాదు. ఈ నేపథ్యంలో ఖాతాదారునికి తెలియకుండానే నేరగాళ్లు బ్యాంకు ఖాతాలను లూటీ చేస్తున్నారు. దీని కోసం నేరగాళ్లు ఖాతాదారుడి వేలిముద్రలను దొంగిలిస్తారు. ఇందుకు కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని, మోసపూరిత విధానాలను వినియోగించుకుంటున్నారు.

అర్ధరాత్రి 12 గంటల నుంచి దోపిడీ

విజయవాడలో తాజాగా వెలుగు చూసిన ఘటనల్లో అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున ఐదు గంటల లోపు నేరగాళ్లు బ్యాంకు ఖాతాల్లోని నగదును వేరే ఖాతాలకు మళ్లించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ విధానంలో ఒక్కో దఫా గరిష్టంగా రూ.15 వేలు మాత్రమే డెబిట్‌ చేసే అవకాశం ఉంది. 24 గంటల్లో మూడు లావాదేవీలు మాత్రమే జరుగుతాయి.

మళ్లీ తెరపైకి ‘ఏఈపీఎస్‌’ మోసాలు

గప్‌చిప్‌గా ఖాతాల్లో డబ్బు దోపిడీ

గత నెలలో విజయవాడలో ఐదు కేసులు నమోదు

అప్రమత్తత అవసరమంటున్న సైబర్‌ పోలీసులు

బయోమెట్రిక్‌ లాక్‌ వేసుకోవాలి

ఏఈపీఎస్‌ నేరాల గురించి ప్రజలు అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండాలి. బయోమెట్రిక్‌ లాక్‌ వేసుకుంటే ఈ నేరాలను నివారించవచ్చు. బ్యాంకు అకౌంట్‌లోని నగదు పోయినట్లు తెలిసిన వెంటనే 1930 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేయాలి. ఆ తరువాత బ్యాంకు మేనేజర్‌ను సంప్రదించి డిస్ప్యూట్‌ ఫామ్‌ను నింపి బ్యాంకులో అందజేయాలి. 90 రోజుల లోపు ఫిర్యాదు చేస్తే నగదు తిరిగి వచ్చే అవకాశాలున్నాయి.

– శ్రీరామచంద్రమూర్తి, ఎస్‌ఐ, సైబర్‌ క్రైం, విజయవాడ

వేలిముద్రల దొంగలున్నారు జాగ్రత్త! 1
1/3

వేలిముద్రల దొంగలున్నారు జాగ్రత్త!

వేలిముద్రల దొంగలున్నారు జాగ్రత్త! 2
2/3

వేలిముద్రల దొంగలున్నారు జాగ్రత్త!

వేలిముద్రల దొంగలున్నారు జాగ్రత్త! 3
3/3

వేలిముద్రల దొంగలున్నారు జాగ్రత్త!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement