ఆటో ఢీకొని చిన్నారి మృతి | - | Sakshi
Sakshi News home page

ఆటో ఢీకొని చిన్నారి మృతి

Dec 11 2023 2:00 AM | Updated on Dec 11 2023 2:00 AM

కంచికచర్ల: ఆటో ఢీకొని చిన్నారి మృతి చెందిన ఘటన మండలంలోని పరిటాలలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ పీవీఎస్‌ సుబ్రహ్మణ్యం కథనం మేరకు... నందిగామకు చెందిన ఓ ముస్లిం యువతి రెండవ సారి గర్భం దాల్చింది. అయితే ఆమె కాన్పు చేయించుకుందామని రెండు రోజుల కిందట పరిటాలలోని పుట్టింటికి వచ్చింది. ఆమెకు షేక్‌ అసీర్‌ అహ్మద్‌ 18 నెలల బాబు కూడా ఉన్నాడు. ఆ చిన్నారి ఆదివారం నాడు రోడ్డుపై ఆడుకుంటున్న సమయంలో గ్రామంలో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌కు చెందిన ఓ ఆటో ఢీ కొట్టింది. దీంతో ఆ చిన్నారి మృతి చెందాడు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కడుపులో ఉన్న బిడ్డ బయటకు రాకుండానే పుట్టిన బాబు మృత్యు ఒడికి చేరటం బాధాకరమని తీవ్రంగా విలపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement