సుభాష్నగర్: నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్గా ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి, ప్రొఫెసర్ డాక్టర్ బీవీ నాగ మోహన్రావును నియమిస్తూ డీఎంఈ నుంచి శు క్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం సూ పరింటెండెంట్ డాక్టర్ పి శ్రీనివాస్ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. ఆయన పీడియాట్రిక్ విభాగాధిపతిగా కొనసాగనున్నా రు. కొన్నేళ్లుగా జీజీహెచ్లో ఫోరెన్సిక్ విభాగాధిపతిగా సేవలందిస్తున్నారు. సూపరింటెండెంట్గా సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.


